ఇక లేటెస్ట్ గా ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న, కియరా అద్వానిలలో ఒకరు హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. త్రివిక్రం రష్మికని తీసుకోవాలని అనుకుంటుంటే.. తారక్ మాత్రం కియరా అద్వానిని తీసుకోవాలని అనుకుంటున్నాడట. వీరిద్దరిలో ఒకరు ఈ సినిమాకు ఫిక్స్ అవుతారని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్ తో రష్మిక, కియరా ఇద్దరు మొదటి కాంబినేషన్ అవుతుంది.
ట్రిపుల్ ఆర్ తర్వాత కొద్దిపాటి గ్యాప్ తోనే తారక్ త్రివిక్రం సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఆర్.ఆర్.ఆర్ తో ఎలాగు తారక్ కు నేషనల్ వైడ్ గా క్రేజ్ వస్తుంది కాబట్టి త్రివిక్రం సినిమాతో అక్కడ సత్తా చాటాలని చూస్తున్నారు.