ఆర్.ఆర్.ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మాటల మాంత్రికుడు త్రివ్క్రం తో సినిమా చేస్తాడని తెలిసిందే. ఈ సినిమాను హారిల్క హాసిని క్రియేషన్స్ తో పాటుగా ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో కళ్యాణ్ రాం కూడా నిర్మాతగా ఉంటున్నారు. అరవింద సమేత సినిమా తర్వాత త్రివిక్రం, తారక్ కలిసి చేస్తున్న ఈ సినిమా కూడా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అన్నది తెలియాల్సి ఉంది. అసలైతే పూజా హెగ్దేని రిపీట్ చేయాలని అనుకోగా ఆమె డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఆమె ప్లేస్ లో వేరే హీరోయిన్ ను అనుకుంటున్నారట.

ఇక లేటెస్ట్ గా ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న, కియరా అద్వానిలలో ఒకరు హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. త్రివిక్రం రష్మికని తీసుకోవాలని అనుకుంటుంటే.. తారక్ మాత్రం కియరా అద్వానిని తీసుకోవాలని అనుకుంటున్నాడట. వీరిద్దరిలో ఒకరు ఈ సినిమాకు ఫిక్స్ అవుతారని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్ తో రష్మిక, కియరా ఇద్దరు మొదటి కాంబినేషన్ అవుతుంది.

ట్రిపుల్ ఆర్ తర్వాత కొద్దిపాటి గ్యాప్ తోనే తారక్ త్రివిక్రం సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఆర్.ఆర్.ఆర్ తో ఎలాగు తారక్ కు నేషనల్ వైడ్ గా క్రేజ్ వస్తుంది కాబట్టి త్రివిక్రం సినిమాతో అక్కడ సత్తా చాటాలని చూస్తున్నారు.                                                                   

మరింత సమాచారం తెలుసుకోండి: