వి రిజల్ట్ తో ఆలోచనలో పడ్డ నాని తన నెక్స్ట్ సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం నాని టక్ జగదీష్ సినిమా చేస్తున్నాడు. శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా తర్వాత నాని రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో శ్యాం సింగ రాయ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను హారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతుంది.

ఈ సినిమాలో నాని ఒకడు కాదు ఇద్దరు ఉంటారట. నాని డ్యుయల్ రోల్ తో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. ఆల్రెడీ నాని ఇదివరకు కూడా డ్యుయల్ రోల్ లో సినిమా చేశాడు. కాని అవి పెద్దగా వర్క్ అవుట్ కాలేదుల్. అయినా సరే రిస్క్ చేస్తూ మరోసారి నాని ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. టాక్సీవలా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రాహుల్ సంకృత్యన్ నానితో క్రేజీ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాలో నానికి జోడీగా సాయి పల్లవి, కృతి శెట్టి నటిస్తున్నారు. ఇద్దరు క్రేజీ హీరోయిన్స్ తో నాని కూడా డ్యుయల్ రోల్ తో ఫ్యాన్స్ ను డబుల్ ధమాకా ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. తప్పకుండా నాని చేస్తున్న ఈ అటెంప్ట్ ఈసారి వర్క్ అవుట్ అవుతుందని అంటున్నారు. ఈ సినిమా తర్వాత నాని వివేక్ ఆత్రేయ డైరక్షన్ లో అంటే సుందరానికీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నానికి జోడీగా నజ్రియా నటిస్తుంది.                                                                                  

మరింత సమాచారం తెలుసుకోండి: