తెలుగు సినిమా పరిశ్రమ కి స్వప్నలోకం సినిమా ద్వారా నటుడిగా పరిచయమయ్యారు జగపతిబాబు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ తనయుడు అయిన జగపతిబాబు అక్కడి నుండి తన టాలెంట్ తో వరుసగా సినిమాల్లో అవకాశాలతో కొనసాగారు. 90వ దశకంలో ఫ్యామిలీ హీరో గా పలు మంచి సక్సెస్ లు అందుకున్న జగపతి బాబు ఇటీవల కొన్నాళ్ళ క్రితం బోయపాటి శ్రీను దర్శకత్వం లో నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన లెజెండ్ సినిమాతో విలన్ గా మారారు.
ఇక అక్కడి నుండి పలు సినిమాల్లో ప్రధాన పాత్రలతో పాటు అక్కడక్కడా విలన్ పాత్రలు చేస్తూ కొనసాగుతున్న జగపతిబాబు ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన మహర్షి అలానే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రంగస్థలం సినిమాల్లో విలన్ పాత్రలు చేసి అత్యద్భుతమైన పేరు దక్కించుకున్నారు. ఇక ప్రస్తుతం పలు సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ కొనసాగుతున్న జగపతిబాబు అతి త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్సార్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాం తాళ్లూరి నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలో ఒక కీలక పాత్ర చేయనున్నట్లు సమాచారం.

ఇప్పటికే ఈ సినిమా లోని ఆయన పాత్ర విషయమే దర్శకుడు సురేందర్ రెడ్డి ఆయనను కలిసి కథ వివరించడం జరిగిందని ఇక తన పాత్ర ఎంతో నచ్చిన జగపతి బాబు వెంటనే చేయడానికి ఒప్పుకుని కాల్షీట్స్ కూడా కేటాయించారు అని అంటున్నారు. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్థంలో పట్టాలెక్కే చాన్స్ ఉందని సమాచారం. ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే దీనికి సంబంధించి అధికారికంగా న్యూస్ బయటకు వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: