'దంగ‌ల్' సినిమాతో ప‌ద‌హారేళ్ల‌కే ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన న‌టి జైరా వ‌సీమ్. చేసిన మొదటి సినిమాతోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాధించుకున్న ఈ బ్యూటీ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన రెండేళ్ల‌కే సినిమాల‌కు స్వ‌స్తి ప‌లుకుతూ గ‌తేడాది అభిమానుల‌కు షాకిచ్చారు. జాతీయ అవార్డు పొందిన‌ జైరా చివ‌రిసారిగా ప్రియాంక చోప్రా న‌టించిన 'ది స్కై ఈజ్ పింక్' సినిమాలో క‌నిపించారు.

 తాజాగా ఆమె మ‌రోసారి అభిమానులకు షాకిచ్చారు. సోష‌ల్ మీడియాలో త‌న ఫొటోలు తొల‌గించాలని తన అబిమానులను కోరింది.‌ ఆమె ఇచ్చిన  ఈ స్టేట్మెంట్ తో అభిమానుల హృద‌యం మ‌రోసారి ముక్క‌లైంది." మీరంతా నాకో సాయం చేస్తార‌ని ఆశిస్తున్నాను. ద‌యచేసి సోష‌ల్ మీడియా అకౌంట్ల నుంచి నా ఫొటోలు తొల‌గించండి.

 అలాగే ఫ్యాన్ పేజీల‌కు కూడా ఇదే చెప్పండి. ఇంట‌ర్నెట్ నుంచి నా ఫొటోల‌ను తొల‌గించ‌డం ఎలాగో అసాధ్యం. కాబ‌ట్టి ఇక‌పై నా ఫొటోలు ఏవీ షేర్ చేయ‌కండి. అన్నింట్లో మ‌ద్ద‌తుగా నిలిచిన మీరు ఈ విష‌యంలో కూడా నాకు స‌పోర్ట్ చేస్తార‌ని భావిస్తున్నా.." అంటూ పోస్ట్ చేసింది.ఈ పోస్ట్ చదివిన నెటిజన్లు ఆమెకు ఏమైందా..అని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: