కరోనా వైరస్ కారణంగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ వాయిదా పడగా ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ 2వసారి హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ జోడి మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 సినిమాలో అలరించింది. ఇప్పుడు మరోసారి రిపీట్ కానుండడంతో అభిమానులు మురిసిపోతున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం ప్రస్తుతం అభిమానులు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
కాగా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మూవీ... ఇటీవలే కీలక యాక్షన్ సన్నివేశాల్ని చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది రామోజీ ఫిలిం సిటీలో వేసిన పురాతన దేవాలయం సెట్ లో ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ఇక్కడ సినిమాలోని కీలక యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించబోతున్నారట. అయితే ఆచార్య అనే సినిమాలో దేవాలయాలపై జరుగుతున్న అవకతవకలపై ఎండోమెంట్ అధికారిగా చిరంజీవి కనిపించబోతున్నాడు అన్నది గత కొన్ని రోజులుగా టాక్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఈ సినిమాలో రామ్చరణ్ నక్సలైట్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగానే కొరటాల శివ సినిమాలు మెసేజ్ ఓరియెంటెడ్ గా ఉంటాయి కాబట్టి ఈ సినిమాలో కూడా ఓ మెసేజ్ ప్రేక్షకులకు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.