బుల్లితెరపై ఢీ షో తనదైన శైలిలో దూసుకెళ్తోంది. ఢీ షోలో అక్సాఖాన్ స్టార్ డ్యాన్సర్ గా మంచి పేరు, గుర్తింపు తెచ్చుకుంది. అక్సాఖాన్ ఇప్పటికే ఢీ షోతో పాటు, సినిమాల్లో కూడా మంచి ఆఫర్లతో దూసుకెళ్తోంది. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ అమ్మడి క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ భామ సోషల్ మీడియాలో మరింత రెచ్చిపోతూ ఫోటోలు పెడుతోంది. మరి ఈ భామ తాజాగా ఢీ చాంపియన్స్ నుంచి ఎలిమినేషన్ కు గురైంది. అయితే, తనను కావాలనే షో నుంచి తప్పించాలని, కొందరు కుట్ర పన్నినట్లు ఓపెన్ స్టేట్ మెంట్స్ ఇచ్చింది.

అయితే తనను ఢీ షో నుంచి బయటకు పంపడం వెనుక శేఖర్ మాస్టర్ హస్తం ఉందని కుండ బద్దలు కొట్టినట్లు చెబుతోంది ఆమె. శేఖర్ మాస్టర్ తన ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారని అందుకే తనను తప్పించినట్లు సాక్షాత్తూ ఢీ జడ్జిపైనే అక్సాఖాన్ విమర్శలు ఎక్కుపెట్టింది. అయితే అక్సా సన్నిహితులు మాత్రం ఆమె తీరును తప్పుపడుతున్నారు. ఈ విషయంపై అక్సాఖాన్ టీమ్ మెంటర్ హైపర్ ఆదిని ఒకసారి చెప్పి చూడమని చాలా మంది సూచించారంట. నాకెందుకు వచ్చిన గొడవ అని ఆది సైలంటైపోయాడని సన్నిహితుల ముందు చెప్పేశాడు.

సుడిగాలి సుధీర్ మాత్రం తనకు ఎంతో ఆప్తురాలైన ఆక్సాఖాన్ కు శేఖర్ మాస్టర్ పై అలాంటి వ్యాఖ్యలు తగవని, సారీ చెప్పమని సూచించాడని సన్నిహితులు చెబుతున్నారు. అయితే అక్సా సుధీర్ మాటలను కూడా పట్టించుకోలేదని అంటున్నారు. తాజాగా పండుతో లవ్ ట్రాక్ నడపడంపై కూడా సుధీర్ మందలించినట్లు వినిపిస్తోంది. అయితే అక్సా తనకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తోందని సుధీర్ తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. మొత్తానికి అక్సా తన టాలెంట్ ను ఇలా పెడమార్గం పట్టించడంపై ఆమె అభిమానులు సైతం ఫీల్ అవుతున్నారు. కానీ అక్సా ఖాన్ మాత్రం  ఇవేవీ పట్టనట్లు వ్యవహరిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: