డైరెక్టర్  తేజ దర్శకత్వంలో వచ్చిన 'లక్ష్మీ కళ్యాణం'అనే సినిమా తో తెలుగు సినిమాలకు పరిచయమైనా కాజల్ అగర్వాల్...ఆ తర్వాత క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కించిన 'చందమామ' సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది. ఇక అప్పటినుండి.. వెనుకకు చూసుకోలేదు లేదు కాజల్. తెలుగువారిని తన అందచందాలతో, తన నటనతో అలరిస్తూనే ఉంది. తెలుగులో దాదాపు అందరీ హీరోలతో నటించింది ఈ చందమామ. అంతేకాకుండా స్టార్ హీరోయిన్‌గా కూడా గుర్తింపు పొంది.ఇప్పటికీ తన స్టార్ డం ను కొనసాగిస్తూ వస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక  కాజల్ అగర్వాల్ ఇటీవలే అక్టోబర్ 30న తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత పూజలు పురస్కారాలు నిర్వహించిన కాజల్ భర్తతో కలిసి హనీమూన్‌కి వెళ్లింది. భర్త గౌతమ్‌తో కలిసి మాల్దీవుల్లో హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తోంది.

 అయితే తాను గౌతమ్‌తో పెళ్లికి ఒప్పుకోవడానికి ఓ రీజన్ ఉందని చెప్పింది కాజల్.. అదేంటంటే..అందరు అమ్మాయిల్లానే.. తనకు కాబోయేవాడు మోకాళ్లపై నిలిచి ఎర్రని గులాబి అందించి తన ప్రేమను వ్యక్తం చేయాలని కోరుకుందట. ఇక కాజల్ ఎలా అయితే ఆశపడిందో.. ఆ విధంగానే గౌతమ్ కిచ్లు తనకు ప్రపోజ్ చేశాడట. దీంతో కాజల్ గౌతమ్‌తో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఒకవేళ అలా చేయకపోతే అతడితో పెళ్లి కష్టమే అని సరాదాగా కామెంట్ చేసింది. ప్రతి అమ్మాయికి అలా తాను పెళ్లి చేసుకోబోయేవాడితో రాజా పూవ్వు అందుకోవాలని కోరుకుంటుందని చెబుతోంది కాజల్. గౌతమ్ ముందే తన పేరెంట్స్ తో మాట్లాడి సంబంధం పెళ్లి ఫిక్స్ చేసేసుకున్నాడని అయినా కానీ తనకు మోకాళ్ల ఉండి ప్రపోజ్ చేయాలని రూల్ పెట్టానని కూడా కాజల్ చెప్పింది.

 ఓ మంచి లవ్ ఫీల్ తర్వాతనే పెళ్లి ఎంతో మధురంగా ఉంటుందని అంటోంది కాజల్.ఇక ప్రస్తుతం కాజల్.. సినిమాల విషయానికొస్తే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన నటిస్తోంది. అంతేకాకుండా మంచు విష్ణు హీరోగా నటిస్తున్న మోసగాళ్ళు సినిమాలో కూడా కాజల్ లీడ్ రోల్ పోషించింది.ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని.. విడుదలకు ముస్తాబవుతోంది..వీటితో పాటు తమిళంలో కూడా ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాజల్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: