అత్తారింటికి దారేది సినిమాలో  "వీడు ఆరడుగుల బుల్లెట్టు..." ఈ పాటను రచించి సంచలనం సృష్టించిన ప్రముఖ రచయిత శ్రీమణి ఈ పాటకు ఫిలిం ఫేర్ అవార్డును కూడా అందుకున్నారు... రచించిన ఎన్నో పాటలతో ప్రేక్షకుల మనసుని గెలుచుకున్నాడు యువ రచయిత. ఈయన ఇప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభించాడు.... అదేనండి పెళ్లి చేసుకొని ఓ ఇంటి వాడయ్యాడు. అందులోనూ అది ప్రేమ వివాహం.... పదేళ్ళ నిరీక్షణకు అందిన బహుమానం. శ్రీమణి గత పదేళ్లుగా ఫరా అనే అమ్మాయిని ప్రేమించారు... ఇప్పుడు ఇరు కుటుంబాల పెద్దవారిని ఒప్పించి పెళ్లి చేసుకొని ఒకటయ్యారు.

 ఇప్పటి వరకు బ్యాచులర్  గా సాగిన ఆయన జీవితం మరో కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇదే విషయాన్ని ఎంతో సంతోషంగా సోషల్ మీడియాలో వెల్లడించారు పాటల రచయిత శ్రీమణి. నా జీవితంలోకి నా దేవత ఫరాకు స్వాగతం. గత పదేళ్లుగా ఈ మూమెంట్‌ కోసం మేము ఎదురుచూశాము. మొత్తానికి మా కల నెరవేరింది. మా మనసును అర్థం చేసుకున్న దేవుడికి, మా తల్లిదండ్రులకు థ్యాంక్స్‌ అని కామెంట్‌ పెట్టి ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. శ్రీమణి ట్వీట్ కి స్పందించారు సంచలన సంగీత దర్శకుడు... అందరి సంగీత అభిమాన తార..... సంగీత సరిగమలను ఎంతో అందంగా పలికించగల దేవి శ్రీ ప్రసాద్. కొత్త జీవితాన్ని ప్రారంభించినందుకు... శ్రీమణి మీకు కంగ్రాట్స్ అని తెలిపారు.

మీ జీవితం ఎంతో ఆనందంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను అని తెలియజేశారు. మొత్తానికి నీ  లవ్ స్టోరీ సక్సెస్ అవడం సంతోషకరం అంటూ... అయితే నీ రొమాంటిక్‌ లిరిక్స్‌ వెనుక ఉన్న సీక్రెట్‌ ఇప్పుడు నాకు అర్థం అయ్యింది.... అంటూ హాస్యం పండిస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు దేవి శ్రీ ప్రసాద్. ఇష్క్ షిఫాయా అని పాడి, రంగులద్దుకున్న అని సీక్రెట్‌గా లవ్‌ చేసి, ఏమోటో ఇది అని మేమందరం అనుకునేలా పెళ్లి చేసుకున్నారన్న మాట. మీ ఇద్దరికి హ్యాపీ మ్యూజికల్‌ మ్యారీడ్ లైఫ్‌ అని కామెంట్‌ పెట్టి శ్రీ మణి అభినందనలు తెలిపారు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్.

మరింత సమాచారం తెలుసుకోండి: