అక్కినేని ఫ్యామిలీ మొత్తం కలిసి నటించిన సినిమా మనం. అక్కినేని నాగేశ్వర రావు నటించిన చివరి సినిమాగా మనం అక్కినేని ఫ్యాన్స్ కు ఎప్పటికి గుర్తుండిపోతుంది. మనం సినిమా రీమేక్ రైట్స్ కు ఎన్ని ఆఫర్లు వచ్చినా సరే నాగార్జున మాత్రం ఆ కథ తమ ఫ్యామిలీకే సొంతమని రీమేక్ రైట్స్ అమ్మలేదు. అంతేకాదు నాన్న గారి జ్ఞాపకంగా ఈ సినిమా ఉంటుందని రైట్స్ అమ్మలేదు.

మనం సినిమాలో అఖిల్ జస్ట్ అలా కనిపించి అలరించాడు. ఇక ఇప్పుడు అఖిల్ హీరోగా మారాడు.. మూడు సినిమాలు చేసినా వర్క్ అవుట్ అవలేదు. ఇక లేటెస్ట్ గా బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా చేస్తున్నాడు. నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ కలిసి మరో మల్టీస్టారర్ సినిమా చేస్తారని తెలుస్తుంది.

మనం డైరక్టర్ విక్రం కుమార్ డైరక్షన్ లోనే ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం విక్రం కుమార్ నాగ చైతన్యతో థ్యాంక్యూ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత విక్రం కుమార్ మరో మనం చేస్తున్నాడని తెలుస్తుంది. చైతు సినిమా తర్వాత ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. మనం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విక్రం కె కుమార్ నానితో గ్యాంగ్ లీడర్ సినిమా చేసినా పెద్దగా వర్క్ అవుట్ అవలేదు. ఫైనల్ గా మళ్లీ అక్కినేని ఫ్యామిలీతో వరుస సినిమాలు చేస్తున్నాడు విక్రం కుమార్. నాగ చైతన్య మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారని టాక్.                                             

మరింత సమాచారం తెలుసుకోండి: