బాహుబలి ఫ్రాంచైజ్ దెబ్బకి ప్రభాస్ క్రేజ్ ఖండాంతరాలు దాటిపోయిందని చెప్పచ్చు. జపాన్, ఆఫ్రికా, చైనా వంటి దేశాల్లో సైతం ఆయనకు ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఆ క్రేజ్ తోనే సాహో లాంటి భారీ బడ్జెట్ సినిమాని ప్లాన్ చేసి రిలీజ్ చేశారు. ఈ సినిమా బాలీవుడ్ లో కలెక్షన్స్ బాగా తెచ్చుకుంది. కానీ మిగతా సౌత్ బాషలలో రిలీజ్ అయినా పెద్దగా జనానికి ఎక్కలేదు. 


ఇప్పుడు అయన ఎలా అయినా హిట్ కొట్టాలని జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ప్రభాస్ కు ఏకంగా చైనా నుండే సినిమా ఆఫర్స్ వచ్చినట్లు చెబుతున్నారు. ఆయనను జాకీ చాన్ సినిమాలో నటించమని కోరారని తాజాగా కృష్ణం రాజు వెల్లడించారు. అయితే అప్పుడు బాహుబలి సినిమా చేస్తున్నందున ఆయన ఆ సినిమా చేయలేనని చెప్పినట్టు కృష్ణం రాజు ఇచ్చిన ఆ ఇంటర్వ్యూ క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడు రాధే శ్యామ్ సినిమా షూటింగ్ దశలో ఉంది.

 పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ కి రిలీజ్ చేయాలని చూస్తున్నారు మేకర్స్.. ఇక ప్రస్తుతం ప్రభాస్ మరో రెండు సినిమాలు అనౌన్స్ చేశారు. మహా నటితో  పాపులర్ అయిన నాగ్ అశ్విన్ డైరెక్షన్‌ లో రానున్న సినిమాని వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మించనుంది. ఈ సినిమాలో దీపికా నటించనున్నట్టు అధికారిక ప్రకటన కూడా మొన్నీ మధ్య విడుదలైంది. తాజాగా మరో ప్యాన్ ఇండియన్ మూవీ కూడా అనౌన్స్ చేశాడు ప్రభాస్. ఆదిపురుష్ పేరిట తెరకెక్కనున్న ఈ సినిమాని తానాజీ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: