సూపర్ స్టార్ మహేష్ బాబు చివరిసారిగా నటించిన సినిమా సరిలేరు నీకెవ్వరు హిట్ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అందుకుంది. పెద్దగా కధ బలమైనది కాక పోయినా కేవలం మహేష్ హీరో కావడంతో అలాగే తనదైన కామెడీతో సినిమాని నడిపించే చేశాడు దర్శకుడు. ఇక ఈ రోజు అనిల్ రావిపూడి పుట్టినరోజు కావడంతో మహేష్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ట్వీట్ చేశాడు.


గత ఏడాది సినిమా సెట్లో ఆయన పుట్టిన రోజు వేడుకలకు సంబంధించి కేక్ కట్ చేసి మహేష్ తినిపిస్తున్న ఫోటో పోస్ట్ చేసి ఇదంతా నిన్న మొన్న జరిగినట్టు అనిపిస్తోంది అప్పుడే ఏడాది అయిపోయిందా అని పేర్కొన్నాడు. అలానే తనకు బాగా నచ్చే దర్శకుల్లో ఒకరైన అనిల్ రావిపూడి కి ఇలాంటి మరెన్నో పుట్టిన రోజులు రావాలని కోరుకుంటున్నానని ఆయన ట్వీట్ చేశాడు. ఇక మహేష్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


. అనిల్ రావిపూడి విషయానికి వస్తే ఆయన ఎఫ్ త్రీ అనే సినిమా చేస్తున్నాడని ఒకసారి లేదు బాలయ్య కోసం కథ రెడీ చేసే పనిలో ఉన్నాడని మరో సారి ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే ఆయన దర్శకుడిగా ఇప్పటికి కూడా మరో సినిమా అయితే ప్రకటించలేదు. ఆయన నిర్మాతగా గాలి సంపత్ అనే ఒక సినిమా మాత్రం తెరకెక్కుతోంది. ఇక మహేష్ తో కూడా ఆయన ఒక సినిమా చేస్తానని మాట ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇవన్నీ ఎప్పటికీ గుర్తు చేస్తాడో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: