అన్ లాక్ సమయంలో బాలీవుడ్ జనాలు చేసినంత ఎంజాయ్ మెంట్ ను..కొంతలో కొంతైనా  సౌత్ సినీ జనాలు చేస్తారనుకున్నారంత. కానీ కరోనా భయం వారిని ఎలాంటి రిస్క్ లు చేయకుండా చేసింది. ఏదో జస్ట్ ఒకరిద్దరు లోకల్ గా ఏదో ఫ్యామిలీతో  ట్రిప్ లు వేశారు తప్ప... అంతగా చెప్పుకునే రేంజ లో వారు చేసింది  లేదు.

సౌత్ సినీ జనాలు బాలీవుడ్ జనాలను ఫాలో అవ్వాలని చూశారు. కానీ కరోనా భయం వారిని కాస్త గట్టిగానే వెంటాడే సరికి ఎందుకొచ్చిన జాలీ ట్రిప్ లనుకుని ఇంటికి, ఫామ్ హౌస్ కే పరిమితమైపోయారు. నటుడు గణేష్ వెంకట్రామ్ .. ఫ్యామిలీతో కూర్గ్ ట్రిప్ వేసి మమ అనిపించాడు. ఇక పూజా రామచంద్రన్ తన హబ్బీతో ట్రెక్కింగ్ చేసి రిలాక్స్ అయింది. అయితే  సౌత్ నటులు కొందరు ఎందుకొచ్చిన రిస్క్ అనుకొని లోకల్ ఫామ్ హౌస్ లు, గెస్ట్ హౌస్ లలోనే రిలాక్స్ అయిపోయారు.

టాలీవుడ్ కపుల్ మహేష్ ,నమ్రతాలు మొన్న అవుట్ డోర్ ట్రిప్ వేయాలనుకున్నారు. చివరినిమిషంలో ఆ ట్రిప్ క్యాన్సిల్ అయింది. ఇక ప్రభాస్ ట్రిప్ లు జోలికి పోకుండా ఇటలీలో జరిగిన రాధేశ్యామ్ షూట్ లోనే లోకల్ ఫ్యాన్స్ తో సెల్ఫీలు దిగి స్ట్రెస్ ఫ్రీ అయ్యాడు.

సౌత్ లో ఎవరైనా అన్ లాక్ లో టూరిస్టులుగా మారి ట్రిస్ వేసారంటే అది ఒక్క నయనతార మాత్రమే.ఈవిడగారు బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ తో గోవాకు వెళ్లి ఫుల్ గా పార్టీలతో సందడి చేసింది.కరోనా భయాలు లేకుండా కలర్ ఫుల్ గా లైఫ్ ను గడపాలని చూసింది. ఈప్రాసెస్ లో కొంతవరకు శాటిస్ఫై అయింది.ఆతర్వాత మరీ ఎక్కువ టైమ్ గోవాలో స్పెండ్ చేయకుండా వెంటనే తిరిగొచ్చేసింది. ఏది ఏమైనా సెలబ్రెటీలంతా ఇలా స్టార్ టూరిస్టులుగా మారిపోయి, ఫ్యాన్స్ కు సోషల్ మీడియాలో మాంచి ట్రీట్ లు ఇస్తూ ఉండడం...ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: