ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..టాలీవుడ్ లో ఒక నటుడిగా, నిర్మాతగా బాగా తెలిసిన వ్యక్తి  బండ్ల గణేష్.. రాజకీయాల్లోనూ తనదైన మాటలతో ఎంతగానో ఆకట్టుకొని  తన మార్క్ చూపించిన సంగతి బాగా పాపులర్ అయ్యింది అప్పుడు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి  మాటల తూటాలు పేల్చడంతో ఈయనకు సంబంధించిన అన్ని విషయాలు వైరల్ అయ్యాయి. అయితే బండ్ల గణేష్ అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటి. తీరా రిజల్ట్ చూస్తే సీన్ రివర్స్ అయింది. దీంతో ఆయన కూడా యూ టర్న్ తీసుకొని రాజకీయాలకు, పొలిటికల్ కామెంట్లకు దూరంగా ఉంటున్నాడు. అయితే జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేళ.. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తున్నారు నెటిజన్లు. ఈ నేపథ్యంలో వీటిపై రియాక్ట్ అవుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు బండ్ల గణేష్.

''నాకు ఏ రాజకీయ పార్టీతో, అలాగే ఏ రాజకీయాలతో సంబంధం లేదు. నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నా. దయచేసి గతంలో మాట్లాడిన మాటల్ని ఇప్పుడు పోస్ట్ చేయొద్దు. ఇది నా అభ్యర్థన.. మీ బండ్ల గణేష్'' అని సోషల్ మీడియా వేదికగా స్పందించాడు  బండ్ల గణేష్. ఈ రకంగా మరోసారి తన రాజకీయ జీవితంపై క్లారిటీ ఇస్తూ గత విషయాలను ఇప్పుడు తవ్వొద్దు అని చెప్పాడు.

నటుడిగా తెలుగు ప్రేక్షకులను అలరించిన  బండ్ల గణేష్.. నిర్మాతగా కూడా పేరు బాగానే సంపాదించాడు . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఆయన నిర్మించిన 'గబ్బర్ సింగ్' ఆయనకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత రాజకీయ గడపతొక్కితే అది బెడిసికొట్టడంతో తిరిగి సినీ ఇండస్ట్రీనే నమ్ముకున్నాడు బండ్ల గణేష్. ఇటీవలే 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో వెండితెరపై అలరించిన ఆయన, కొద్దిరోజుల క్రితమే కొత్త సినిమాను కూడ ప్రకటించేశాడు.ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి: