అంతేకాదు, దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పంచుకుంటూ ఎప్పటి కప్పుడు అభిమానులతో తన సంతోషాలు షేర్ చేసుకుంటోంది. ఇటీవలే తన సోదరుడితో కలిసి స్విమ్మింగ్ పూల్లో ఉన్న ఫొటోతో సోషల్ మీడియాను హీటెక్కించిన రకుల్.. ఆ తర్వాత స్కూబా డైవింగ్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. దీంతో ఆమె అడ్వెంచర్ సైడ్ కూడా అభిమానులు చూసేశారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి తనలోని సెక్సీనెస్ చూపిస్తోందీ ఢిల్లీ భామ. మాల్దీవుల్లో తెగ సందడి చేస్తున్న రకుల్.. తాజాగా బీచ్లో బికీనీ వేసుకొని ఉన్న ఫొటోను ఇన్స్టాలో షేర్ చేసింది. దాన్ని చూసిన అభిమానులకు వెర్రెక్కుతోంది. బ్లాక్ బికినీ ధరించి, నల్ల కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని బీచ్లో ఉయ్యాల్లో పడుకొని ఉన్న రకుల్ ఫొటో సోషల్ మీడియాలో తెగ వేడి పుట్టిస్తోంది.
ఇప్పుడు ఆమె అభిమానులంతా దీని గురించే చర్చించుకుంటున్నారు. ఈ ఫొటో చూసిన ప్రతి ఒక్కరూ రకుల్ సెక్సీనెస్కు ఫిదా అయిపోతున్నారు. తమకు రకుల్ బికినీ ట్రీట్ ఇచ్చిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం చాలామంది సినీ తారలు మాల్దీవులకే వెకేషన్ కోసం వెళ్తున్నారు. ఇటీవల పెళ్లి చేసుకున్న కాజల్.. భర్తతో కలిసి ఇక్కడే హనీమూన్ జరుపుకుంది. అలానే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా ప్రస్తుతం మాల్దీవుల్లోనే ఉంది. ఇటీవలే ఇక్కడ ఆమె కరోనా టెస్టు చేయించుకున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది.