సూపర్ స్టార్ మహేష్ పరశురాం కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా సర్కారు వారి పాట ఈ సినిమాను మత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ వారు కలిసి నిర్మిస్తున్నారు. సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. పొలిటికల్ సెటైర్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో మహేష్ మాస్ లుక్ తో అలరిస్తాడని తెలుస్తుంది.

సినిమా పూజా కార్యక్రమాలు ఈమధ్యనే జరిగాయి. గీతా గోవిందం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న పరశురాం తన నెక్స్ట్ సినిమా చేస్తే స్టార్ తోనే చేయాలనే ఉద్దేశంతో మహేష్ తో సర్కారు వారి  పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఇంటర్వల్ బ్యాంగ్ అదిరిపోతుందని తెలుస్తుంది. కమర్షియల్ సినిమా ఫార్మెట్ లోనే ఓ మంచి మెసేజ్ తో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది.

సినిమాలో ఇంటర్వల్ బ్యాంగ్ మాత్రం అరుపులు పెట్టించేలా ఉంటుందని అంటున్నారు. పరశురాం మీద నమ్మకంతో ఈ సినిమా ఇచ్చిన మహేష్ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకొవాలని చూస్తున్నాడు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు హ్యాట్రిక్ హిట్లతో దూసుకెళ్తున్న మహేష్ డబుల్ హ్యాట్రిక్ కి సిద్ధమవుతున్నాడు. జనవరిలో మొదలుపెట్టే ఈ సినిమాను 2021 చివరి కల్లా రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత రాజమౌళి డైరక్షన్ లో సినిమా ఉంటుందని తెలిసిందే. ఆర్.ఆర్.ఆర్ సినిమా తర్వాత రాజమౌళి మహేష్ తో సినిమా ప్లాన్ చేశాడు. తప్పకుండా ఈ కాంబినేషన్ అదిరిపోయే సినిమా వస్తుందని తెలుస్తుంది.                                                         



మరింత సమాచారం తెలుసుకోండి: