మెగాస్టార్ లూసిఫర్ రీమిక్ ను ప్రతిస్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకు సంబందించి ఎంతో మంది దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి.రీసెంట్ గా ఓ తమిళ దర్శకుడు పేరు బాగా వినిపించింది.అయితే ఎట్టకేలకు చిరు వినాయక్ వైపే మొగ్గు చూపుతున్నాడన్నది తాజా సమాచారం. తెలుగు ఆడియన్స్ కోరుకునే ఎమోషన్స్ కి తగ్గట్టుగా లూసిఫెర్ స్క్రిప్ట్‌ లో వినాయక్ తో పాటు ఆకుల శివ, సాయి మాధవ్ బుర్రా మార్పులు చేసి ఇప్పటికే చిరుకి పూర్తి స్క్రిప్ట్‌ కూడా వినిపించారట.

మెగాస్టార్ కి కూడా చేసిన మార్పులు బాగా నచ్చాయని.. అందుకే స్క్రిప్ట్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్ నగర్ టాక్.అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలు పెడతారన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు.అయితే ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది సంక్రాంతి తరువాత ఈ సినిమాని అధికారికంగా ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ‘లూసిఫర్’లో మంజు వార్యర్, హీరోకి చెల్లి పాత్రలో నటించింది.

అయితే మంజు వార్యర్ పాత్రలోనే సుహాసిని కనిపించబోతుందట. కాగా ఈ సినిమాలో హీరోయిజమ్ ఎలివేషన్స్ ఉన్న సీన్స్ మెయిన్ హైలైట్ గా ఉండేలా.. మెగా అభిమానులకు ఫుల్ జోష్ ని ఇచ్చేలా సినిమాని తెరకెక్కించాలని వినాయక్ షాట్ మేకింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాడట.. ప్రస్తుతం ప్లాప్స్ లో ఉన్న వినాయక్ ఈ సినిమాతో ఎలాగైనా ఫామ్ లోకి రావాలని పట్టుదలతో ఉన్నాడట. 

మరింత సమాచారం తెలుసుకోండి: