ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ కు ధీటుగా మరొక క్యారెక్టర్ ఉందట.ఈ క్యారెక్టర్ కోసం మొదట విజయ్ సేతుపతి ని ఎంచుకున్నారు.. కానీ కరోనా కారణంగా షెడ్యూల్స్ అన్ని మిస్ అయి.. డేట్స్ అన్ని క్రాస్ అయి మొత్తానికి విజయ్ సేతుపతి ఈ సినిమా నుండి తప్పుకున్నాడు. ఇప్పుడు ఈ పాత్ర కోసం విజయ్ సేతుపతి లాంటి మరో హీరో కోసం పుష్ప టీమ్ వెతుకులాట మొదలెట్టింది.
మరి విజయ్ సేతుపతి లాంటి హీరో.. పైగా తమిళం లాంటి భాషలో ఫుల్ క్రేజ్ ఉన్న హీరో దొరకడం అంటే కష్టమే. మరి చూడాలి ఎవర్ని తీసుకుంటారన్న దానిపై ఆసక్తి నెలకొంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం.. శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగనుంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ స్మగ్లర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఫుల్ జోష్ లో బన్నీ పుష్ప తో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.