పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాతో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మరో పీరియాడికల్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కాగా వకీల్ సాబ్ సినిమాని దిల్ రాజు, బోనికపూర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్  లాయర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ ఆయనకు జంటగా నటిస్తుండగా ప్రకాష్ రాజ్, అంజలి, నివేద థామస్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్లో ప్రారంభమైంది.

మరోవైపు లాక్‌డౌన్‌ కు ముందు రెండు షెడ్యూల్స్ జరుపుకున్న క్రిష్ సినిమా తదుపరి షెడ్యూల్ అతి త్వరలో ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ ఒక అద్భుతమైన పాత్రలో నటిస్తున్నారని రిలీజ్ అనంతరం తప్పనిసరిగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటుందని దర్శకుడు కృష్ణ సహా యూనిట్ మొత్తం ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే వీటి తర్వాత ఇప్పటికే మరో మూడు సినిమాలు లైన్లో పెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాటి అనంతరం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయనున్నట్లు టాక్. ఇప్పటికే వీరిద్దరి సినిమాకు సంబంధించి కొద్ది రోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు  ప్రచారం అవుతున్నాయి.

కాగా ఈ సినిమాని ఎవరు నిర్మిస్తారు అనే దానిపై మాత్రం ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదు ఇక లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ పవర్ఫుల్ సినిమాని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నట్లు టాక్. ఇప్పటికే ఈ సినిమా కథను పవన్ తో పాటు నిర్మాత చరణ్ కి కూడా వినిపించిన త్రివిక్రమ్ ప్రస్తుతం పవన్ కమిట్మెంట్స్ ముగిసిన అనంతరం దీనిని పట్టాలెక్కించేలా ప్లాన్ చేస్తున్నారట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన బయటకు వచ్చే వరకు వెయిట్ చేయాలి......!!

మరింత సమాచారం తెలుసుకోండి: