నిజంగానే రాజమౌళి ఛత్రపతి శివాజి కథతో మహేష్ సినిమా చేస్తే మాత్రం అరుపులే అని చెప్పొచ్చు. తప్పకుండా రాజమౌళి ఈ సినిమాతో మరోసారి తెలుగు సినిమా స్థాయిని ఏంటన్నది చూపించేలా ఉన్నాడు. మహేష్ తో రాజమౌళి సినిమా అంటే ఆమాత్రం ఉండాల్సిందే. ఈ సినిమా బడ్జెట్ కూడా 300 కోట్ల దాకా ప్లాన్ చేస్తున్నారట.
మహేష్ సర్కారు వారి పాట సినిమా పూర్తి కాగానే రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ తర్వాత ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది. 2021 లో మహేష్, జక్కన్న సినిమా ప్రకటించి 2022లో మొదలు పెట్టి 2023 చివర్లో లేదా 2024లో సినిమా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. తప్పకుండా ఈ సినిమా రికార్డులను తిరగ రాస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బాహుబలితో క్రియేట్ చేసిన రికార్డులన్ని ట్రిపుల్ ఆర్ తో ఆ సినిమాతో నెలకొల్పిన రికార్డులను మహేష్ సినిమాతో బ్రేక్ చేసేలా ప్లాన్ చేశారు.