టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా యువ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ సక్సెస్  అందుకని మహేష్ మూవీ కెరీర్లోని బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఏకే ఎంటర్టైన్మెంట్స్, జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలపై తెరకెక్కిన ఈ సినిమాని మహేష్ బాబు, దిల్ రాజు, అనిల్ సుంకర లు కలిసి నిర్మించారు. కాగా ఈ సినిమాలో మిలిటరీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో మహేష్ బాబు అత్యద్భుతమైన పెర్ఫార్మెన్స్ కనబరిచారు. తొలిసారిగా మహేష్ కు జోడీగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించగా రత్నవేలు ఫోటోగ్రఫీ అందించారు.

కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ విలన్ గా నటించగా జయప్రకాష్ రెడ్డి, విజయశాంతి, సత్యదేవ్, రఘు బాబు, అజయ్, సంగీత, రావు రమేష్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించడం జరిగింది. ఇక ఈ సినిమా భారీ సక్సెస్ తర్వాత మరొకసారి మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్లో సినిమా వస్తే చూడాలని సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆరాటపడుతున్నారు. అయితే ఈ సినిమా విషయంలో కూడా మరోవైపు కొద్ది రోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు కూడా ప్రచారం అవుతున్నాయి.

ఇకపోతే నేడు తన జన్మదినం సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే తన తదుపరి సినిమా ఎఫ్3 సీక్వెల్ కు సంబంధించి కథాకథనాలు సిద్ధమయ్యాయని డిసెంబర్ రెండో వారంలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు చెప్పారు. ఇక మహేష్ బాబుతో నెక్స్ట్ సినిమా ఉంటుందా అనే విషయమై ఆయన సమాధానమిస్తూ ఆయనతో ఎప్పుడు సినిమా చేయాలన్నా  తాను సిద్ధమేనని ఒక్క ఫోన్ కొడితే చాలు ఆయన వద్ద వాలిపోయి వెంటనే మంచి కథను వినిపిస్తాను అని అని అనిల్ చెప్పడం జరిగింది. మరి వీరిద్దరి క్రేజీ కాంబినేషన్లో మరో సినిమా ఎప్పుడు వస్తుందో తెలియాలి అంటే మరి కొన్నాళ్ళ వరకు వెయిట్ చేయక తప్పదు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: