సరిలేరు నీకెవ్వరూ సినిమా సూపర్ హిట్ తర్వాత మహేష్ బాబు సుకుమార్ ని కాదని మరీ చేస్తున్న సినిమా 'సర్కార్ వారి పాట'.. పరశురామ్సినిమా కి దర్శకుడు. చాల వెరైటీ గా ఈ కథ ఉండబోతుందని అంటున్నారు..పరశురామ్ టాలీవువ్డ్ లో ఇంతవరకు రానటువంటి స్టోరీ తో ఈ సినిమా చేస్తున్నాడట.. స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయ్యింది.. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ చాలామందిని ఆకట్టుకుంది.. మహేష్ ని ఇలా మునుపెన్నడూ చూడలేదని నాటున్నారు.. ఈ సినిమా కి తమన్ సంగీతం ప్లస్ అవుతుందని అంటున్నారు.. అంతా సవ్యంగా జరిగితే మహేష్ బాబు నవంబర్ నుంచి అమెరికాలో సర్కారు వారి పాట షూటింగ్ మొదలుపెట్టేవాడు. కానీ ఇప్పుడా అవకాశం లేదని ఇన్ సైడ్ టాక్.

ఇక ఈ సినిమా లో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ని పరిశీలిస్తుండగా, మహేష్ ద్విపాత్రాభినయం చేస్తుండడం విశేషం.. అప్పుడెప్పుడో చిన్నప్పుడు మహేష్ డబుల్ రోల్ లో నటించాడు.. ఇప్పటివరకు అలా నటించలేదు.. దాంతో ఈ సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. ఇక ఈ సినిమా కోసం విలన్ గా బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ని ఆలోచిస్తున్నారట.. అన్ని సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా బాట పడుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారట.

సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఆ భారీ సెట్ లో ఇంటర్వెల్ కు ముందు వచ్చే 15 నిమిషాల సీన్స్ అందులోనే చిత్రీకరించబోతున్నారట. ఆ 15 నిమిషాల సీన్స్ కూడా చాలా అద్బుతంగా ఉంటాయని అంటున్నారు. సినిమాలో ఇంటర్వెల్ సీన్ ఓ రేంజ్ లో ఉంటుందని అందుకు తగ్గట్లుగా సెట్ ఉండాలనే ఉద్దేశ్యంతో భారీగా రామోజీ ఫిల్మ్ సిటీలో వేయిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక క్లైమాక్స్ కు సంబంధించిన ఒకటి రెండు సీన్స్ కూడా అక్కడ చిత్రీకరణ జరుపబోతున్నారట. అందుకే ఆ సెట్ ను భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నట్లుగా చెబుతున్నారు. కీర్తి సురేష్ నటించబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కరోనా పరిస్థితులను బట్టి ఈ సినిమా ఆదారపడి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: