స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రస్తుతం క్రియేటివ్ సినిమాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. తొలిసారిగా పుష్ప రాజ్ అనే పవర్ ఫుల్ మాస్ పాత్రలో అల్లు అర్జున్ నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా లాక్‌డౌన్‌ కు ముందు శేషాచలం అడవుల్లో కొంతవరకు షూటింగ్ జరుపుకుంది.

గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా పలు కమర్షియల్ హంగులు కలగలిపి దర్శకుడు సుకుమార్ ఈ సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తెరకెక్కిస్తున్నట్లు టాక్. మరో వైపు ఈ సినిమాకు సంబంధించి పాటలు అప్పుడే అదిరిపోయే రేంజ్ లో సిద్ధం చేశాడట సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్. ఇక ఈ సినిమాలోని ప్రత్యేకమైన మాస్ సాంగ్ కోసం ఒక బాలీవుడ్ భామని టాలీవుడ్ కి తీసుకురానున్నట్లు సమాచారం. ఇక ఇటీవల ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ఎంతో అట్టహాసంగా ప్రారంభమైంది. అల్లు అర్జున్, రష్మిక సహా పలువురు ఇతర నటులపై ప్రస్తుతం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాలోని కీలకమైన ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ఒక అద్భుతమైన ట్విస్ట్ తో ప్రేక్షకాభిమానులను ఎంతో ఆకట్టుకుంటుందని అంటున్నారు. నిజానికి దీంతోపాటు సినిమాలో ఇంటర్వల్ బ్లాక్ కూడా అదిరిపోతుందని సమాచారం. గతంలో సుకుమార్ సినిమాలు మంచి కథా కథనాలతో సాగడంతో పాటు అక్కడ అక్కడ షాకింగ్ ట్విస్ట్ లతో థ్రిల్ చేసిన విషయం గమనించవచ్చు. మరి ఈ సినిమాతో బన్నీ, సుకుమార్ లు ఏ రేంజి సక్సెస్ ని అందుకుంటారో చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: