వకీల్ సాబ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ అయ్యప్పనుం కోషియం అనే మలయాళ సినిమా తెలుగు రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా దర్శకుడు సాగర్ చంద్ర ఇప్పటికే షూటింగ్ కి అన్ని ఏర్పాట్లు చేయగా పవన్ రాకకోసం వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కరోనా తర్వాత వకీల్ సాబ్ సినిమా షూటింగ్ లో అయన ఇటీవలే జాయిన్ అయ్యారు.. ఈ సినిమా కంప్లీట్ అవగానే అయన ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారని తెలుస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ రీమేక్ హక్కులని పొందగా పవన్ తో ఈ కథను ఒప్పించి పెద్ద సాహసమే చేసింది..

అయితే ఈ సినిమా రీమేక్ హక్కులని సొంతం చేసుకున్నటినుంచి లీడ్ రోల్స్ కోసం సాగిన వేట ఎంతకీ తెగలేదు. ముందు ప్రధాన పాత్రలకు ప్రచారం జరిగిన పేర్లు వేరు. చివరికేమో ఎవరూ ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ లైన్లోకి వచ్చాడు. ఒరిజినల్లో బిజు మీనన్ చేసిన పోలీస్ పాత్రను పవన్ చేయబోతున్నట్లు వెల్లడైంది. మరి పృథ్వీరాజ్ చేసిన ఎక్స్ సర్వీస్ మ్యాన్ పాత్ర ఎవరిది అనే ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా పూర్తి చేసే పనిలో ఉన్న పవన్ కళ్యాణ్ మరోవైపు క్రిష్ సినిమా పనులను కూడా పర్యవేక్షిస్తున్నారు.

 సినిమాలో హీరోయిన్ ఎవరనే సస్పెన్స్ మెల్లగా వీడుతోందని తెలిసింది. ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ తో అందరి దృష్టిలో పడిన నిధి అగర్వాల్ నే ఫైనల్ చేయబోతున్నట్టు వినికిడి. లాక్ డౌన్ కు ముందే ఈ ప్రతిపాదన ఉన్నప్పటికీ ఇప్పటికి రూట్ క్లియర్ అయ్యిందని చెబుతున్నారు. అధికారిక ప్రకటన త్వరలో చేయొచ్చు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో పవన్ యుద్ధవీరుడు యోధుడిగా నటిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. రెండు దశాబ్దాల పవన్ కెరీర్ లో ఏనాడూ చేయని హిస్టారికల్ పాత్ర ఇందులో ఉంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: