వరుస ఫ్లాప్ లతో సతమతమవుతన్న శ్రీనువైట్ల చాల గ్యాప్ తర్వాత తన కొత్త సినిమా ని అనౌన్స్ చేశాడు.. మంచు విష్ణు హీరో గా ఈ సినిమా ని అనౌన్స్ చేయగా 13 ఏళ్ళ క్రితం ఇదే కాంబోలో వచ్చిన ఢీ ఎంత పెద్ద హిట్టో మూవీ లవర్స్ మర్చిపోలేదు. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఆ సినిమా తాలూకు వీడియోలు, స్క్రీన్ షాట్లని మేమ్స్ రూపంలో వాడుకుంటూనే ఉన్నారు. అంతగా కామెడీలో ఓ డిఫరెంట్ ట్రెండ్ సెట్ చేసిన మూవీ ఢీ. దానికి సీక్వెల్ గా  వీరి కాంబో లో ఈ ఢీ అండ్ ఢీ అనే సినిమా తెరకెక్కబోతుంది.

శ్రీనువైట్ల విజయాలకు ఆగడు సినిమా బ్రేక్ వేసింది.. ఆ తర్వాత అయన చేసిన సినిమాలు ఒక్కటి కూడా హిట్ కాలేదు.. బ్రుస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంథోనీ సినిమాలు అట్టర్ ఫ్లాప్ లుగా మిగిలాయి.. దాంతో చాల గ తీసుకుని మరీ ఈ సినిమా చేస్తున్నాడు.. అటు విష్ణు గ్రాఫ్ కూడా ఏమంత బాగాలేదు. విష్ణుకి 2016లో వచ్చిన ఆడో రకం ఈడో రకం ఆఖరి హిట్టు. ఆ తర్వాత అంతకు ముందు చాలా ఫ్లాపులు పలకరించాయి. ఆచారి అమెరికా యాత్ర, వోటర్ మరీ దారుణంగా దెబ్బ తిన్నాయి. మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రాలేని విధంగా మార్కెట్ బాగా డౌన్ అయ్యింది. అయినా నెరవకుండా మోసగాళ్లు అనే పాన్ ఇండియా మూవీని నిర్మించిన విష్ణు ఢీ అండ్ ఢీకి కూడా ప్రొడ్యూసర్ గా ఉన్నాడు.

అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఢీ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన కోనవెంకట్ ఈ సినిమాకు పనిచేయట్లేదని పోస్టర్ చూస్తే తెలుస్తుంది.. అయన పేరు ఈ పోస్టర్ లో ఎక్కడా కనిపించలేదు. చూస్తుంటే అయన కి, శ్రీను వైట్ల కి మధ్య వివాదం ఇంకా చల్లారలేదనిపిస్తుంది. ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తుండగా గోపి మోహన్ రచన, పీటర్ హెన్స్ ఫైట్స్ సమకూరుస్తున్నారు. మరి సూపర్ హిట్ కోసం కలిసిన ఈ డిజాస్టర్ కాంబో ఏం చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: