బాలీవుడ్ లో సూపర్ ఉన్న అమ్మడు కియరా అద్వాని తెలుగులో రెండు సినిమాలకే మొహం చాటేస్తుంది. అదేంటి తెలుగులో అమ్మడు చేసిన రెండు సినిమాల్లో ఒకటి హిట్టు మరోటి ఫ్లాప్ అయ్యింది కదా అనుకోవచ్చు. కియరా అద్వాని తెలుగు సినిమాలు చేయకపోడానికి పెద్దగా కారణాలు ఏమి లేవు. బాలీవుడ్ లో అమ్మడి డేట్స్ ఖాళీ లేకపోవడం వల్లే కియరా ఇక్కడ సినిమాలు చేయట్లేదని తెలుస్తుంది. ఎమ్మెస్ ధోని అన్ టోల్డ్ స్టోరీతో ప్రేక్షకులకు దగ్గరైన కియరా అద్వాని ఏడాదికి నాలుగు సినిమాలు చేస్తుంది.

2020లో కూడా అమ్మడు మూడు సినిమాలు చేసింది. రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. 2021లో కూడా మరో నాలుగు సినిమాలు రెడీగా ఉన్నాయి. బాలీవుడ్ లో ప్రస్తుతం కియరా ఫాం కొనసాగుతుంది. మిగతా హీరోయిన్స్ అంతా కొద్దిగా వెనక్కి తగ్గడంతో కియరా ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది. అందుకే ఆమెకు తెలుగులో స్టార్ ఛాన్సులు వస్తున్నా సరే అమ్మడు ఇక్కడ అవకాశాలను లైట్ తీసుకుంటుంది.

టాలీవుడ్ లో మహేష్ తో భరత్ అనే నేను, రాం చరణ్ తో వినయ విధేయ రామ సినిమాల్లో నటించిన కియరా అద్వాని తెలుగులో ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబినేషన్ సినిమాలో నటిస్తుందని టాక్. అయితే డేట్స్ అడ్జెస్ట్ అయితేనే అమ్మడు ఆ సినిమా చేస్తుందట. కాని ఇప్పుడప్పుడే తెలుగులో నటించే అవకాశం లేదని తెలుస్తుంది.                                                                                              
 

మరింత సమాచారం తెలుసుకోండి: