టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్స్ పై క్రేజీ అంచనాలు వుంటాయి .అలాంటి కాంబినేషనే పూరీ,మహేష్ ల కాంబినేషన్.ఈ జోడీ రిపీట్ కావాలని సూపర్ స్టార్ అబిమానులే కాదు సగటు సినీ ప్రేక్షకుడు కూడా ఎన్నో రోజుల నుండి కోరుకుంటున్నారు.అమద్య వీరి కాంబినేషన్ ఖచ్చితంగా రిపీట్ అవుతుందని అనుకున్నారు అబిమానులు.అయితే మహేష్ కి కథలో మార్పులు కోరడం పూరీ నిరాశతో వెనుదిరగడం జరిగాయి.అయితే వీరిద్దరి మద్య చిన్నపాటి వివాదం జరిగింది.

అయితే మహేష్ ఒక్క అడుగు ముందుకెసి పూరీ కథ చెపితే వింటా అనడంతో మళ్ళీ ఆశలు చిగురించాయి.దాంతో పూరి మదిలో వున్న ‘జనగనమణ’ సినిమా స్క్రిప్ట్ ను రెడీ చేసి, పూరి మహేష్ కి వినిపించాలనుకుంటున్నాడని.. ఆ మధ్య బాగా వార్తలు వినిపించాయి. నిజానికి అప్పట్లోనే మహేష్ బాబుకు పూరి ఈ కథను వినిపించాడు. అప్పుడు మహేష్ కి కథ నచ్చలేదు. మళ్ళీ మార్పులు చేసుకుని వస్తా అని చెప్పిన పూరి, ఆ తరువాత మళ్ళీ ఆ కథ మీద కూర్చోలేదు.

 అయితే ఈ లాక్ డౌన్ లో స్క్రిప్ట్ పూర్తి చేసినా పూరి.. ఇప్పటికే మహేష్ కి కథ వినిపించాడట.కాగా మహేష్ కి కథ బాగా నచ్చిందని వచ్చే ఏడాది వీరి కలయికలో సినిమా ఉంటుందని తెలుస్తోంది. అన్నట్టు భారత దేశంలో అవినీతి జాఢ్యం నేపథ్యంలో ఈ జనగనమణ కథను పూరి రాస్తున్నాడట. అంటే ఈ కథ మొత్తం మన వ్యవస్థలో లోపాల చుట్టూ, అలాగే మన న్యాయ వ్యవస్థలోని డొల్లతనం చుట్టూ కథ సాగుతుందట.మరి వీరి హట్రిక్ కాంబినేషన్ ఎలాంటి సంచలనాలు సృస్టిస్తుందో చూడాలి . 

మరింత సమాచారం తెలుసుకోండి: