సోషల్ మీడియాలో హీరోల అభిమానులు వారి అభిమాన హీరోల పేర్లతో ఒక హ్యాష్ ట్యాగ్ ను క్రియేట్ చేసి ట్రెండింగ్ గా మార్చడం సర్వసాధారణం. అయితే దీనికి భిన్నంగా హీరోయిన్ అభిమానులు ఒక హ్యాష్ ట్యాగ్ ను క్రియేట్ చేసి దానిని ట్రెండింగ్ గా మార్చడం ఇప్పుడు షాకింగ్ న్యూస్ గా మారింది.  


రష్మిక మందన్న అభిమానులు మొదటిసారి జాతీయస్థాయిలో ఆమె పేరును ట్రెండింగ్ గా మార్చేసారు. నేషనల్ క్రష్ ఆఫ్ ద వరల్డ్’ అనే హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆ హ్యాష్ ట్యాగ్ తో పాటు నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో  హాట్ టాపిక్ గా కొనసాగుతోంది.



వీటితో పాటు నేషనల్ క్రష్ రష్మిక అంటూ కూడా సోషల్ మీడియాలో మరో హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతోంది. రష్మిక అభిమానులు  సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న ఈ ట్యాగ్ మరింత షాకింగ్ గా మారింది. వాస్తవానికి రష్మిక కన్నడ బ్యూటీ అయినప్పటికీ ఆమె ప్రస్తుతం  తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతోంది. తమిళంలో కూడా ఈమె హీరోయిన్ గా త్వరలో ఎంట్రీ  ఇవ్వబోతుంది.


కరోనా పరిస్థితుల నేపధ్యంలో చాలామంది హీరోయిన్స్ తమ పారితోషికాన్ని నిర్మాతల కోరికమేరకు తగ్గించుకుని సహకరిస్తూ ఉంటే రష్మిక మాత్రం దీనికి భిన్నంగా ప్రస్తుతం ఆమె పారితోషికాన్ని రెండు కోట్లకు పై మాటే అని అంటోంది. అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అఖిల్ కూడ తన తదుపరి సినిమాకు రష్మిక కావాలి అని అడుగుతున్న పరిస్థితులలో ఆమె మ్యానియా టాప్ హీరోల నుండి మిడిల్ రేంజ్ హీరోల వరకు ఏ స్థాయిలో ఉందో అర్ధం అవుతుంది. ప్రస్తుతం రష్మిక ‘పుష్ప’ మూవీ కోసం సుకుమార్ సలహాతో పట్టుపట్టి చిత్తూరు యాసను నేర్చుకుంది అంటే రష్మిక పట్టుదల ఎటువంటిదో అర్ధం అవుతుంది. చెప్పుకోతగ్గ అందం లేకపోయినా కేవలం తన డ్రెస్ సెన్స్ తో రష్మిక సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం చూసి గూగుల్ కూడా షాక్ అయినట్లు టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి: