ప్రస్తుతం బిజినెస్ లో స్థిరపడ్డ తరుణ్ ఇప్పటికీ పెళ్ళి చేసుకోలేదు. ఇలాంటి పరిస్థితులలో ఆనాటి తరుణ్ ను పెల్లిచేసుకునే అవకాశం తనకు వచ్చినా తాను సున్నితంగా తిరస్కరించానని అప్పటి విషయాలు ఇప్పుడు బయటపెట్టి ప్రియమణి అందరికీ షాక్ ఇచ్చింది. ఒకనాటి గ్లామర్ బ్యూటీ ప్రియమణి మంచినటి కూడ జాతీయ స్థాయిలో ఉత్తమనటి అవార్డు అందుకున్న ఈమె ప్రస్తుతం కొన్ని ఛానల్స్ నిర్వహిస్తున్న డాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది.
వెంకటేష్ నటిస్తున్న ‘అసురమ్’ రీమేక్ ‘నారప్ప’ సినిమాలో ఈమె మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడుతోంది. ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తరుణ్ తో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని వివరిస్తూ తాను తరుణ్ కలిసి ‘నవవసంతం’ సినిమాలో కలిసి నటిస్తున్నప్పుడు తమ ఇద్దరి పై చాల గాసిప్పులు వచ్చాయని తాము త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నారు అన్న వార్తలు అప్పట్లో కొన్ని పత్రికలు ప్రచురించిన విషయాన్ని ప్రియమణి గుర్తుకు చేసుకుంది.
ఈ వార్తలు అన్నీ అప్పట్లో రోజరమణి దృష్టి వరకు రావడంతో ఆమె స్వయంగా ఆ మూవీ షూటింగ్ స్పాట్ దగ్గరకు వచ్చి తరుణ్ ను పెళ్ళి చేసుకుంటావా అని అడిగినప్పుడు తాను షాక్ అయిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ తాము కేవలం స్నేహితులం మాత్రమే అని సమాధానం ఇచ్చిందట. అయితే అప్పట్లో రోజరమణి తరుణ్ ఆర్తి అగ్రవాల్ ప్రేమను తిరస్కరించి ప్రియమణి ప్రేమను ఎందుకు అంగీకరించింది అన్నది సమాధానం లేని ప్రశ్న..