వచ్చే సంక్రాంతి కి సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.. కానీ దీనిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు మూవీ టీమ్. ఇక 'వకీల్సాబ్' సినిమా తర్వాత ఆయన ఏ సినిమా షూట్లో జాయిన్ అవుతారనే దానిపై క్లారిటీ లేనప్పటికీ.. రీసెంట్గా క్రిష్ బర్త్డే రోజు.. టీమ్ అంతా పవన్ని కలవడంతో.. 'వకీల్సాబ్' తర్వాత పవన్ ఖచ్చితంగా క్రిష్ సినిమానే చేస్తాడనేలా వార్తలు నడుస్తున్నాయి. పవన్ లుక్ కూడా ఈ సినిమా కోసం అనేలా మార్చాడు.ఇక ఈ సినిమాలో ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నటిస్తుందనే విషయం తెలిసిందే.మరో హీరోయిన్గా ఈ సినిమాలో నిధి అగర్వాల్ అంటూ వార్తలు నడిచాయి. కానీ తాజాగా ఈ సినిమాలో మరో హీరోయిన్గా నేచురల్ బ్యూటీ సాయిపల్లవి చేస్తుందని అంటున్నారు.
అంతేకాదు..ఈ సినిమాలో ఆమె పాత్ర ఇదంటూ కొన్ని వార్తలు కూడా సంచరిస్తున్నాయి. ఈ సినిమాలో సాయిపల్లవి జమీందారి కుటుంబ అమ్మాయిగా కనిపిస్తుందని అంటున్నారు. ఆమె పాత్ర సినిమాకి హైలెట్ అనేలా ఉంటుందని, అందుకే సాయిపల్లవి ఈ సినిమా చేయడానికి అంగీకరించిందని అంటున్నారు.మరి ఇదే వార్త కనుక నిజం అయితే ఇక పవర్ స్టార్ ఫ్యాన్స్ కి పండగే. ఇక మరోవైపు పవన్ ఈ ప్రాజెక్ట్ కన్నా ముందు అయ్యప్పనున్ కోషియమ్ రీమేక్ లో నటిస్తాడనే వార్తలు కూడా ఫిల్మ్ నగర్ లో విపరీతంగా వినిపిస్తున్నాయి...!