కరోనా వైరస్ కారణంగా నష్టపోయిన చాలా మంది. ఇప్పటికీ అదే విధంగా కొనసాగుతున్నారు.. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఇప్పటికీ కూడా నష్టాలు భర్తీకాలేదు.. సినిమా థియేటర్లు ఓపెన్ కాక పోవడంతో సినిమాలు వాళ్ళ కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.అలాంటి వాళ్ళ కోసం సీఎం వరాల జల్లు కురిపించారు.. అదేంటంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం టీఆర్ఎస్ మానిఫెస్టోను విడుదల చేసిన సీఎం కేసీఆర్.. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కరోనా వల్ల కుదేలైన తెలుగు సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం అన్నారు..



సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని సమర్ధిస్తూ సినీ తారలు ట్వీట్ చేస్తున్నారు. ముఖ్యంగా చిరంజీవి ట్వీట్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది.కరోనాతో కుదేలైన సినిమా రంగానికి వరాల జల్లు కురిపించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చిన్న సినిమాలకి రాష్ట్ర జీఎస్టీ రీఎంబర్స్‌మెంట్, రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లకు విద్యుత్ కనీస డిమాండ్ చార్జీల రద్దు, రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్స్‌లో షోలను పెంచుకునేందుకు అనుమతి, మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీలలో ఉన్న విధంగా టిక్కెట్ల ధరలను సవరించుకునే వెసులుబాటు లాంటి చర్యలు ఈ కష్ట సమయంలో ఇండస్ట్రీకి, దానిపై ఆధారపడిన లక్షలాది కుటుంబాలకు ఎంతో తోడ్పాటుగా ఉంటాయి.. మీరు ఇచ్చిన స్ఫూర్తి తోనే సినీ పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు..



ఈ మేరకు చిరంజీవి ట్వీట్ కు చాలా మంది ప్రముఖులు రీ ట్వీట్ చేశారు.వారిలో యంగ్ హీరోలు నితిన్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ తదితరులు ఉన్నారు. ఇదిలా ఉంటే, తెలంగాణ వ్యాప్తంగా తక్షణమే సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు తెరుచుకోవడానికి కూడా అనుమతులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. కేంద్ర హోం శాఖ ఇచ్చిన నిబంధనలు పాటిస్తూ సినిమా థియేటర్లు తెరుచుకోవచ్చని జీవోలో సూచించింది.. అంతేకాదు 50 శాతం సీటింగ్ కెపాసిటీతో థియేటర్లు నడుపుకోవచ్చని వెల్లడించింది.. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: