బాహుబలి స్టార్ ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలతో అనౌన్స్ చేసి బిజీ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధేశ్యామ్ అనే సినిమా చేస్తున్నాడు ఈ సినిమా పూర్తయ్యాక మరో రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయి. అందులో ఒకటి మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా కాగా మరొకటి బాలీవుడ్ దర్శకుడు దర్శకత్వం లోని ఆదిపురుష్ సినిమా. అయితే నాగ్ అశ్విన్ సినిమా కంటే ఆది పురుష్ సినిమా నుంచే ఎక్కువగా అప్డేట్స్ వస్తున్నాయి. భారతదేశంలో తన అన్ని చిత్రాలకు కలిపి రూ .1000 కోట్ల పెట్టుబడి పెట్టగలిగిన ఏకైక స్టార్ ప్రభాస్. 


రజనీకాంత్, సల్మాన్ ఖాన్ కూడా ఇప్పుడు అలాంటి ఘనతను దక్కించుకోలేదు అనేది వాస్తవం. ఈ సమయంలో ప్రభాస్‌ చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి, వాటి సంయుక్త బడ్జెట్ రూ .1000 కోట్లకు పైగా ఉంటుందని చెబుతున్నారు. ఎలా అంటే షూట్ చివరి దశలో  ఉన్న “రాధే శ్యామ్” బడ్జెట్ 250 కోట్ల రూపాయలు. ఈ సినిమా 2021 లో థియేటర్లలోకి రానుంది. రొమాంటిక్ డ్రామా ఐరోపా నేపథ్యంలో సెట్ చేయబడిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. యువి క్రియేషన్స్ మరియు గోపి కృష్ణ మూవీస్ దీనిని నిర్మిస్తున్నాయి. ఇక బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించబోయే “ఆది పురుష్” నిర్మాణానికి 450 కోట్ల రూపాయల బడ్జెట్ ఫిక్స్ చేశారు. 


ఇది భారతదేశంలో నిర్మించిన అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటిగా నిలవనుంది. ఈ సినిమా షూటింగ్ జనవరిలో ప్రారంభమవుతుంది. బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ టి సిరీస్ ఈ సినిమాని ఇంతటి భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఈ సినిమా ఆగస్టు 11, 2022 లో విడుదల కానుంది. అది పూర్తి అయ్యాక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఉంది. రూ .300 ప్లస్ కోట్లతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టులో బాలీవుడ్ లో స్టార్స్ అయిన దీపికా పదుకొనే మరియు అమితాబ్ బచ్చన్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ దాని షూటింగ్ భాగాన్ని ఏప్రిల్ 2021 లో ప్రారంభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: