ఇటీవల జరిగిన సర్కారు వారి పాట పూజా కార్యక్రమంలో మహేష్ బాబు కుమార్తె సితార ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విషయం తెలిసిందే. ఆమె  సినిమా లాంచ్ ఈవెంట్ కి కార్యక్రమానికి హాజరు కావడం ఇదే మొదటిసారి కాగా ఈ సినిమాకి ఆమె క్లాప్‌ కూడా కొట్టింది. అయితే ఈ సర్కారు వారి పాట పూజా కార్యక్రమంలో సితార రావడానికి వెనుక ఈ సినిమా డైరెక్టర్ పరశురాం ఉన్నారని అంటున్నారు. సితార సమక్షంలో ఈ చిత్రాన్ని లాంచ్ చేయడం వల్ల ఈ ప్రాజెక్టుకు లేడీ లక్ మొత్తం వస్తుందని పరశురామ్ మేకర్స్‌తో పేర్కొని అందుకు వాళ్ళని ఒప్పించారని అంటున్నారట. 


మహేష్ కూడా ఈ మేరకు తన సమ్మతిని తెలియజేయడంతో సితారఈవెంట్ కి తన తల్లితో హాజరు అయినట్టు చెబుతున్నారు. ఇదిలా వుండగా, సర్కారు వారీ పాట షూటింగ్ ఈ ఏడాది చివర్లో హైదరాబాద్‌లో ప్రారంభమవుతుందని చెబుతున్నారు. ఈ సినిమా మేరకు మొదట అమెరికాలో  మొదటి షెడ్యూల్ను ప్లాన్ చేసారు కాని వారు తమ ప్రణాళికలను మార్చుకున్నట్లు చెబుతారు. అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. 


అమెరికాలో భారీగా కరోనా కేసులు నమోదు అవుతుండడంతో అక్కడికి వెళ్లి షూట్ చేయడం రిస్క్ అని భావించి వెనకదుకు వేసినట్టు చెబుతున్నారు. సర్కారు వారి పాటకు పరశురామ్ దర్శకత్వం వహిస్తోండగా మరియు మైత్రి మూవీ మేకర్స్మ్, 14 రీల్స్ ప్లస్ అలాగే జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ నటించనున్న ఈ సినిమాకి తమన్ సంగీతం సమకూర్చనున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: