ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..సూపర్ స్టార్
మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమాతో నాన్
బాహుబలి ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు.పక్క
మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం
మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అటు ఈ సినిమాకి దర్శకత్వం వహించిన
అనిల్ రావిపూడి కెరీర్ కి కూడా బాగా ప్లస్ అయ్యింది. ఇప్పుడు
మహేష్ పరశురాం దర్శకత్వంలో సర్కారువారి పాట
సినిమా చేస్తున్నాడు. ఇటీవల
పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇక ఈ సినిమాని మైత్రి
మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ తో కలిసి
మహేష్ బాబు కూడా భాగస్వామిగా మారి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి
సురేష్ హీరోయిన్గా నటిస్తుంది.బ్యాంకింగ్ రంగంలో జరిగే ఆర్ధిక నేరాల నేపధ్యంలో ఈసినిమా తెరకెక్కుతుందని సమచారం.
గీత గోవిందం లాంటి బ్లాక్బస్టర్ హిట్ తర్వాత పరసురాం తెరకెక్కిస్తున్న చిత్రం కావడం, మరోవైపు సరిలేరు నీకెవ్వరు లాంటి హిట్ తర్వాత మహేష్ నటిస్తున్న
సినిమా కావడంతో ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టే పరశురాం స్క్రిప్ట్ను పర్ఫెక్ట్గా సిద్ధం చేసుకున్నాడని, మంచి కథతో పాటు స్కీన్ ప్లే అద్భుతంగా ఉంటుందని టాక్.
ఇక అసలు విషయానికి వస్తే...
సూపర్ స్టార్ మహేష్ నుండి వస్తున్న సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు కొత్త మెసేజ్ ఉంటుంది. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు చిత్రాలు అలా వచ్చే బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి. దీంతో సర్కారువారి పాట
సినిమా కూడా సందేశాత్మకంగా ఉంటుదని తెలుస్తోంది. తనకు ఎలాంటి కథ కావాలో, అందులో ఎలాంటి ఎలిమెంట్స్ ఉండాలో మహేష్ ముందుగానే చెప్పడంతో, అందుకు తగ్గట్టు పరశురాం స్కిప్ట్ను డిజైన్ చేసినట్లు సమాచారం.
ఇక ఈ సినిమాకి ఇంటెర్వెల్ సీన్ ఆయువుపట్టులాంటింది.ఈ ఇంటర్వెల్ సీనుతో సినిమా ఓ రేంజ్లో ఉంటుందని మేకర్స్ ఫ్యాన్స్ కి భరోసా ఇస్తున్నారు. దీంతో పరశురాం అండ్ టీమ్ ఎంతో శ్రమించి ఇంటర్వెల్ సీన్స్ డిజైన్ చేశారట. మహేష్ కెరీర్లోనే ది బెస్ట్ ఇటర్వెల్గా నిలిచిన ఒక్కడు,
పోకిరి సినిమాలను మించి సర్కారు వారి పాట ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయేలా ఉంటుందని, థియేటర్లో విజిల్స్తో మోత మోగిపోతుందని అంటున్నారు. అంతే కాకుండా క్లైమాక్స్లో వచ్చే సన్నివేశాలు కూడా ఓ రేంజ్లో తెరకెక్కిస్తున్నారట. ఇలాంటి మరెన్నో
మూవీ అప్ డేట్స్ కోసం
ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...