తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అరవై పదుల వయసు దాటినా కూడా.. చిరు తన సినిమాల జోరును అస్సలు తగ్గించడం లేదు. చాలా కాలం తర్వాత రాజకీయాల్లో నుంచి తిరిగొచ్చిమెగాస్టార్.. మళ్ళీ ఇటీవల కాలంలో వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఖైదీ నంబర్150 సినిమాతో టాలీవుడ్ రీఎంట్రీ ఇచ్చి.. తన సత్తా చాటాడు. ఇక ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు చిరంజీవి. అయితే ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఇండ్రస్టీ లో చర్చనీయాంశంగా మారింది. అదేమిటంటే  చిరు సినిమా ఒక హీరోయిన్ కారణంగా గా ఆగిపోయింది.

వినడానికి అందరికి ఆశ్చర్యంగా ఉన్న ఇది మాత్రం నిజం. అయితే చిరు సినిమా ఆగిపోయింది ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల క్రితం. అది కూడా అతిలోక సుందరి శ్రీదేవి కారణంగా ఆగిపోయింది. హీరో అయినా హీరోయిన్ అయినా ఒక హోదా వచ్చాక ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కారు. వారు చెప్పినట్టే వినాలని పట్టుబడతారు. ఆ క్రమంలో నిర్మాతలను దర్శకులను వారితో కలిసి నటించే నటీనటులను అందర్నీ ఇబ్బంది పడుతూ ఉంటారు.అలా శ్రీదేవికి స్టార్ హోదా రాగానే, అలాగే బాలీవుడ్ టాలీవుడ్ రెండు పరిశ్రమల్లోనూ తన హవా సాగుతున్న సమయంలో శ్రీదేవి చేసిన పని కారణంగా చిరంజీవి కి కోపం వచ్చి రెండు సినిమాలను ఆపేశాడు.

ఆ సినిమాలే మధురాల దొంగ,కొండవీటి దొంగ.కొండవీటి దొంగ సినిమాలో శ్రీదేవి కొన్ని మార్పులు మరియు సినిమా పేరు కొండవీటి రాణి అని పెట్టాలని చెప్పటంతో చిరు ఆమెతో సినిమా చేయనన్నాడు. ఆ కొండవీటి దొంగ సినిమా విజయశాంతి, రాధ లతో కలిసి చేశాడు.ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.అలా అప్పట్లో హీరోయిన్ శ్రీదేవి వల్లమెగాస్టార్ నటించిన రెండు సినిమాలు అర్ధాంతరంగా ఆగిపోవడం జరిగింది.ఇక ప్రస్తుతం చిరు నటిస్తున్న ఆచార్య సినిమా షూటింగ్ ఇటీవలే మొదలై.. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. తాజాగా మెగాస్టార్ కూడా ఈ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.వవచ్చే ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా తర్వాత చిరూ.. వేదళం రీమేక్ లో నటించనున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: