ఖైదీ సినిమాతో తొలిసారిగా కమర్షియల్ సక్సెస్ అందుకున్న చిరంజీవి ఆపై కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలని అందుకుని దూసుకెళ్లారు. ఇక ప్రస్తుతం చిరంజీవి హీరోగా సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే మెగాస్టార్ తర్వాత టాలీవుడ్ లో ఎవరు నెంబర్ వన్ హీరో అనే విషయమై ఎప్పటి నుంచో అటు ప్రేక్షకులతో పాటు ఇటు టాలీవుడ్ వర్గాల్లో కూడా విపరీతంగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ విషయం తెర మీదకు వచ్చినపుడల్లా ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తుంటాయి. క్రేజ్, పాపులారిటీ మరియు మార్కెట్ వాల్యూ పరంగా వీరిద్దరికీ సమానమైన పేరుప్రఖ్యాతులు ఉన్నాయి. అలానే వీరిద్దరూ కూడా ఒక రకంగా నెంబర్ వన్ స్థానానికి అర్హులే అనేది అటు ప్రేక్షకులతో పాటు ఇది విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతుంటారు.
ఇకపోతే ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి రెండు భాగాల విజయాలతో పాన్ ఇండియా స్టార్ గా అత్యద్భుతమైన క్రేజ్ పాపులారిటీ దక్కించుకున్న హీరో ప్రభాస్ చేతిలో ప్రస్తుతం భారీ సినిమాలు ఉండటంతో పాటు క్రేజ్ పరంగా కూడా మరింత వేగంగా ఆయన దూసుకెళ్తున్నారు. దానితో ప్రస్తుతం చిరంజీవి అనంతరం ప్రభాసే నెంబర్ వన్ అనేది కొందరు ప్రేక్షకాభిమానులు చెబుతున్న మాట. అయితే ఈ విషయమై పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతూ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఇద్దరు కూడా ఇప్పటివరకు ఒక్క పాన్ ఇండియా సినిమా చేయనప్పటికీ వారిద్దరికీ పలు ఇతర భాషల ప్రేక్షకుల్లో అలానే దేశవిదేశాల్లో కూడా భారీ స్థాయిలో క్రేజ్ ఉందని మొత్తంగా చూసుకుంటే ఈ ముగ్గురు హీరోలు ప్రస్తుతం నెంబర్ వన్ స్థానానికి అతి దగ్గరగా ఉన్న వారేనని అంటున్నారు. మరి రాబోయే రోజుల్లో వీరిలో ఎవరు ఏ రేంజి సక్సెస్ మరియు క్రేజ్ దక్కించుకుని ముందుకు దూసుకెళ్తారో చూడాలి.....!!