జీహెచ్ఎంసీ... గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అయిన ర్వాత నుంచి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలు పన్నుతున్నాయి. ఇక ఇటీవలే అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమ మేనిఫెస్టోలో గ్రేటర్ వాసులకు అనేక వరాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. లాగే తెలుగు సినిమా పరిశ్రమకు కూడా అనేక వరాలు ప్రకటించారు. ఇక తెలంగాణ ప్రభుత్వం మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తెలుగు సినిమా పరిశ్రమ పట్ల చొరవ చూపాలని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సారథ్యంలోని గీతా ఆర్ట్స్‌ విజ్ఞప్తి చేసింది. కరోనా కష్టకాలంలో చిత్ర పరిశ్రమను ఆదుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన రాయితీల పట్ల ఆ సంస్థ అధినేత అల్లు అరవింద్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇదే మాదిరిగా జగన్ ప్రభుత్వం సైతం సినీ పరిశ్రమను ఆదుకునేలా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.




కాగా, తెలంగాణ సీఎం కేసీఆర్ సినీ పరిశ్రమకు ఇచ్చిన రాయతీలపై మెగాస్టార్‌ చిరంజీవి సైతం ట్విట్టర్‌ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. ‘‘కరోనాతో కుదేలైన సినిమా రంగానికి వరాల జల్లు కురిపించిన సీఎం కేసీఆర్‌కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. చిన్న సినిమాలకు రాష్ట్ర జీఎస్టీ రీయింబర్స్‌మెంట్‌, రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్లకు విద్యుత్‌ కనీస డిమాండ్‌ చార్జీలు రద్దు, రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్స్ లో షోలను పెంచుకునేందుకు అనుమతివ్వడం. మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీలలో ఉన్న విధంగా టిక్కెట్ల ధరలను సవరించుకునే వెసులుబాటు లాంటి చర్యలు ఈ కష్ట సమయంలో ఇండస్ట్రీకి, దానిపై ఆధారపడిన లక్షలాది కుటుంబాలకు ఎంతో తోడ్పాటుగా ఉంటాయి. కేసీఆర్‌ నేతృత్వంలో ఆయన విజన్‌కి తగ్గట్టుగా తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి సాధించి దేశంలోనే మొదటి స్థానాన్ని పొందుతుందన్న పూర్తి విశ్వాసం మాకుంది’’ అని చిరంజీవి తెలిపారు. ఈ తరుణంలో చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ జగన్ సర్కారుకు సైతం స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. అలాగే సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్న చిరంజీవి, నాగార్జునలకు తమ సంస్థ గీతా ఆర్ట్స్‌ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.




మరింత సమాచారం తెలుసుకోండి: