మళయాళంలో సూపర్ హిట్టైన అయ్యప్పనుం కోషియం రీమేక్ తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాను సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా మరో హీరో ఎవరన్నది మాత్రం ఇంకా తెలియలేదు. ఇక ఈ సినిమాకు స్క్రిప్ట్ లో మాటల మాత్రికుడు త్రివిక్రం హెల్ప్ తీసుకుంటాడని తెలుస్తుంది.

త్రివిక్రం చెప్పాడు కాబట్టే పవన్సినిమా చేస్తున్నాడని అంటున్నారు. అయితే ఈ సినిమా తెలుగు రీమేక్ ను యాజిటీజ్ చేస్తే సరిపోతుంది. కాని త్రివిక్రం మాటలతో సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ తీసుకురావాలని చూస్తున్నారు. అయితే మాటల వరకు ఓకే కాని కావాలని కథ మార్చితే మాత్రం అది రాంగ్ ట్రాక్ లోకి వెళ్లే అవకాశం ఉంది. త్రివిక్రం ఎంట్రీతో సీన్ రివర్స్ అవుతుందని అంటున్నారు.

ఇక పవన్ తో గోపీచంద్ ఈ సినిమాలో నటిస్తాడని అంటున్నారు. ముందు సుదీప్, రానా, నితిన్ వంటి స్టార్స్ పేర్లు వినపడగా ప్రస్తుతం గోపీచంద్ ఈ సినిమాలో నటిస్తారని అంటున్నారు. మరి పవన్, గోపీచంద్ స్క్రీన్ షేర్ చేసుకుంటారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఈ సాగర్ చంద్ర డైరక్షన్ లో కేవలం రెండు లాంగ్ షెడ్యూల్ లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నారు. త్రివిక్రం ఎంట్రీ సినిమాకు ప్లస్సా మైనస్సా అన్నది సినిమా వస్తేనే కాని తెలుస్తుంది.                                                                                       

మరింత సమాచారం తెలుసుకోండి: