ఇక ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అతి పెద్ద ఎసెట్ అని చెప్పాలి. అప్పట్లో ఈ సినిమా సాంగ్స్ అతి పెద్ద సంచలనం సృష్టించాయి. ఇకపోతే మహేష్ బాబు సరసన బాలీవుడ్ భామలైన బిపాషా బసు, లిసారే జోడి కట్టిన ఈ సినిమాని తన సొంత బ్యానర్ అయిన జయంతి ఫల్క్రమ్ సినెర్జీస్ బ్యానర్ పై భారీ ఖర్చుతో దర్శకుడు జయంత్ నిర్మించడం జరిగింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా దర్శకుడు జయంత్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ నిజానికి సినిమా కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంతో కష్టపడ్డారని, గుర్రపు స్వారీ తో పాటు పలు ఇతర విద్యల్లో కూడా ఎంత ప్రత్యేక శిక్షణ తీసుకున్న మహేష్, ఈ సినిమా కోసం ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదని షాకింగ్ గా వెల్లడించారు.
నిజానికి కథా కథనాల పరంగా అలానే అక్కడక్కడా కొంత యాక్షన్ సీన్స్ పరంగా ఆకట్టుకున్న ఈ సినిమా ఓవరాల్ గా సక్సెస్ కాకపోవడానికి ప్రధాన కారణం మహేష్ పాత్ర పక్కన మంచి కమెడియన్ పాత్ర లేకపోవడమేనని అప్పట్లో ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ ను బాగా కోరుకునే వారిని, అలానే ఇటువంటి కథలకు ఆ టైపు క్యారెక్టర్స్ అవసరం అని అన్నారు. ఆ విధంగా మహేష్ పక్కన ఎవరైనా కమెడియన్ ని పెట్టి అతడితో మంచి పంచ్ డైలాగ్స్ పెట్టి ఉంటె సినిమా కొంత వరకు మంచి సక్సెస్ సాధించేదని జయంత్ అభిప్రాయపడటం జరిగింది. నిజానికి ఈ సినిమా సక్సెస్ కాకపోవడంతో తాను కొంత నిరాశకు గురయ్యారని అయినప్పటికీ సినిమా ఫెయిల్యూర్ అనంతరం కూడా మహేష్ తనను ఎంతగానో ప్రోత్సహించారని జయంత్ ఈ సందర్భంగా మాట్లాడుతూ చెప్పారు....!!