అయితే ఇప్పుడిప్పుడే సుజిత్ సాహో ఎఫెక్ట్ నుంచి బయటపడుతున్నారు.. దెబ్బ మీద దెబ్బ అన్నట్లు చిరంజీవి లూసిఫర్ రిమేక్ కూడా తన చేయిజారిపోయింది.. దాంతో ఇంకా డిప్రెషన్ కి వెళ్ళిపోయాడు.. ఇక రీమేక్ ల జోలికి వెళ్లోద్దని అనుకున్నాడో ఏమో బెల్లంకొండ శ్రీనివాస్ హీరో గా ఛత్రపర్తి రీమేక్ ని బాలీవుడ్ లో చేయాలనీ ఆఫర్ వచ్చింది.. దాన్ని సున్నితంగా తిరస్కరించాడు సుజిత్.. తొలి సినిమా లా ఒరిజినల్ స్టోరీ తో సినిమా చేసి హిట్ కొట్టాలనే ఐడియా లో ఉన్నాడు.
ఈ నేపథ్యంలో సుజీత్ తో యూవీ క్రియేషన్స్ వారు ఓ సినిమా చేయడానికి ప్లాన్స్ చేస్తున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. సుజీత్ ని డైరెక్టర్ గా పరిచయం చేసిన యూవీ టీమ్.. వెంటనే 'సాహా' వంటి భారీ బడ్జెట్ సినిమాని కూడా అతని చేతిలో పెట్టారు. ఇదే క్రమంలో ఇప్పుడు మూడో సినిమాని మొదలుపెట్టడానికి యూవీ టీమ్ సన్నాహాలు చేస్తోందని సమాచారం. మరి ఈ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో వస్తున్న వార్తలు నిజమో కాదో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.