ఇక ఈ సినిమాకి సంబంధించి చివరగా ఒక్క షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉంది. ఈ షెడ్యూల్ ని 10 రోజుల్లో దాన్ని పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. ఇక కరోనా నేపథ్యంలో పలు జాగ్రత్తలను తీసుకుంటున్నారట. అందులో భాగంగా టీమ్ మొత్తానికి కరోనా టెస్ట్లు చేయడంతో పాటు వారందరినీ క్వారంటైన్ బబుల్లో పెట్టనున్నారట. అలాగే బయట వారిని షూటింగ్ ప్రదేశానికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.
ఈ మూవీ టీం కరోనా నేపథ్యంలో పలు జాగ్రత్తలను తీసుకుంటున్నారట. అందులో భాగంగా టీమ్ మొత్తానికి కరోనా టెస్ట్ లు చేయడంతో పాటు వారందరినీ క్వారంటైన్ బబుల్ లో పెట్టనున్నారట. అలాగే బయట వారిని షూటింగ్ ప్రదేశానికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. కాగా ఈ మూవీలో రానా పోలీస్ గా కనిపించనుండగా.. సాయి పల్లవి నక్సలైట్ గా నటిస్తున్నారు. నందితా దాస్, ప్రియమణి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సుధాకర్ చెరుకూరి, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించనున్నారు. శంతను మొయిత్రా సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి ఎ.ఆర్. అశోక్ కుమార్ సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు. ఇదివరకు రిలీజ్ చేసిన అరణ్య టీజర్కు అన్ని చోట్లా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమా కూడా ప్యాన్ ఇండియా లెవల్ల్లో విడుదలకానుందని టాక్.