ఇటీవలే మంచు విష్ణు అభిమానులందరికీ దర్శకుడు శ్రీను వైట్ల అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. గతంలో శ్రీను వైట్ల మంచు విష్ణు కాంబినేషన్ లో తెరకెక్కించనున్న ఢీ  సినిమా సీక్వెల్ ఇటీవలే శ్రీను వైట్ల ప్రకటించారు. ఇటీవలే మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ప్రకటన చేయడంతో ప్రస్తుతం అభిమానులందరూ మురిసిపోతున్నారు. కాగా  గతంలో మంచు విష్ణు శ్రీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కిన ఢీ  టాలీవుడ్ చిత్ర పరిశ్రమను  కొత్త పుంతలు తొక్కించింది  అన్న విషయం తెలిసిందే. ఒక సాదాసీదా సినిమాగా వచ్చి ప్రేక్షకులందరికీ ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ అందించి కడుపుబ్బ నవ్వించి భారీ విజయాన్ని అందుకుంది ఢీ   సినిమా. ఈ సినిమాలో మంచు విష్ణు సరసన జెనీలియా నటించగా శ్రీహరి ప్రధాన పాత్రలో నటించారు.



 ఈ ముగ్గురు పాత్రలతోనే ఎక్కువగా సాగిపోయే సినిమా ప్రేక్షకులు అందరినీ ఎంతగానో మెప్పించింది. కాగా ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించ పోతున్నట్లు శ్రీను వైట్ల ప్రకటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి అటు ప్రేక్షకుల్లో. అయితే ఈ సినిమాకు... డబుల్ డోస్  అనే టైటిల్ ఫిక్స్ చేసింది చిత్రబృందం. ఈ సినిమాలోని కీలక పాత్రలో ఎవరు నటించబోతున్నారు అనే దానిపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో ఇప్పటికే క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నట్లు తెలుస్తోంది.



 ఇక ఈ సినిమాలో ప్రధాన హీరోయిన్ పాత్ర కోసం అను ఇమ్మాన్యుయేల్ లేదా ప్రగ్యా జైస్వాల్ లలో ఎవరినో ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉందని ప్రస్తుతం టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. ఇక ఇద్దరు హీరోయిన్లలో ఒకరిని సెలెక్ట్ చేసేందుకు అటు దర్శకుడు శ్రీను వైట్ల హీరో మంచు విష్ణు కూడా చర్చించినట్లు సమాచారం. కాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతున్నట్లు  తెలుస్తోంది. కాగా ఢీ   సినిమాలో శ్రీహరి పాత్ర ఎంతో కీలకమైనది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక సీక్వల్ అంటే అవే పాత్రలు కలిసి ఉంటాయి. మరి ఢీ   సీక్వెల్లో శ్రీహరి పాత్రలో ఎవరు నటించబోతున్నారు అన్నది మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: