పూజా హెగ్డే ఈ మధ్య వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది. ఈమె ఇంటర్వ్యూ అంటేనే ఏమైనా కాంట్రవర్సీ ఉందేమో ? అని వెతికే పరిస్థితి ఏర్పడింది. ఈ భామ ఆ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ఏకంగా దక్షిణాదినే టార్గెట్ చేయగా అందరూ విరుచుకుపడ్డారు. దీంతో సారీ చెప్పక తప్పలేదు. ఇప్పుడు కూడా ఈ భామ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ అమ్మడి మాటలు బన్నీ.. ఎన్టీఆర్.. మహేశ్‌ ఫ్యాన్స్‌ మధ్య చిచ్చు పెట్టాయి. లేటెస్ట్‌గా ఓ ఇంటర్వ్యూలో ఆమెకు అరవింద సమేత వీర రాఘవకు సంబందించిన టాపిక్‌ వచ్చింది.

సినిమా తన కెరీర్‌ కు ఎలా వుపయోగపడిందో చెప్పింది పూజా. అరవింద సమేత ఎప్పటికీ ఓ ప్రత్యేకమైన చిత్రమని.. ఎన్టీఆర్‌తో కలిసి వర్క్‌ చేయడం అద్భుతమనిపించిందని చెప్పుకొచ్చింది. ఇద్దరి ఎనర్జీ లెవెల్స్‌ కొంచెం ఎక్కువని అందుకే ఆన్‌ స్క్రీన్‌లో తమ జోడీ ప్రేక్షకులను అలరించిందని చెప్పింది పూజా. ఈ మాటలతొ తారక్ ఫ్యాన్స్‌ ఖుషీ అయినా మహేశ్‌, బన్నీ అభిమానులకు మాత్రం రుచించలేదు.అసలు ఎనర్జీకి తమ హీరోనే పెట్టింది పేరని అలాంటిది మా ఇద్దరి ఎనర్జీ లెవెల్స్‌ ఎక్కువని తారక్‌ గురించి పూజా అనడంతో బన్నీకి ఏం తక్కువని ప్రశ్నిస్తున్నారు  

బన్నీ ఫ్యాన్స్‌ . ఇక అల వైకుంఠపురంలో బన్నీ, పూజా ఆన్‌స్క్రీన్‌  కెమిస్ట్రీ అదరిందని.. అలాంటిది దానిని ఏమీ ప్రస్తావించకుండా ఎన్టీఆర్‌ను మాత్రమే ప్రస్తావించడం బన్నీ ఫ్యాన్స్‌కు నచ్చలేదు. మరో పక్క మహేష్ ఫ్యాన్స్ కూడా తమ హీరో మహర్షి లాంటి హిట్ ఇస్తే మా వాడి గురించి ఏమీ మాట్లాడకపోవడం సరికాదని అంటున్నారు. అయితే ఆమె చెప్పడమే పాపం అయినట్టు ఈ ఫ్యాన్స్ అంతా మీద పడిపోవడమ సరికాదని ఆమె అభిమానులు అంటున్నారు. ఆమెకు ఏది ఇష్టమో చెప్పే హక్కు కూడా లేదా అని వారు ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: