పాన్ ఇండియా సినిమాలు తీయడానికి తమిళ హీరోలు కూడా ఇష్టపడుతున్నారు. ఇప్పుడ ఈ లిస్ట్లోకి ధనుశ్ కూడా చేరనున్నారు. ఆయన కథానాయకుడుగా త్వరలోనే ఓ పాన్ ఇండియా సినిమా పట్టాలు ఎక్కనున్నది. ఈ సినిమాకు తమిళ ‘రాట్చసన్’ ఫేం రామ్కుమార్ దర్శకత్వం వహించనున్నారు. సత్య జ్యోతి ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
కాగా, హీరో ధనుశ్ ఇప్పటికే కొన్ని హిందీ సినిమాలు చేశారు. దీంతో తన తదుపరి సినిమాను పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించాలని నిర్మాతలు అనుకుంటున్నారు. ఈ చిత్రం హీరో ధనుశ్కు 42వది. ఈ సినిమాను రెండేళ్ల క్రితమే తీయాలనుకున్నారు. కానీ ఇది వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. ప్రస్తుతం ధనుశ్ సినిమాల మీద సినిమాలు తీస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన బాలీవుడ్లో ‘అత్రంగీ రే’ అనే సినిమా తీస్తున్నారు. అంతే కాకుండా మాళవిక మోహనన్ హీరోయిన్గా కార్తీక్ నరే న్ దర్శకత్వంలో ఓ తమిళ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమాలు పూర్తయ్యాకే రామ్ కుమార్ టీంలో కలవనున్నారు. వచ్చే ఏడాది జూన్లో ఈ చిత్రం సెట్స్పైకి వెళ్లనున్నదని సమాచారం.