మన రెండు తెలుగు రాష్ట్రాల్లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఉన్న ఫ్యాన్  ఫాలోయింగ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన సినిమా విడుదల అంటే చాలు వారి అభిమానులు చేసే రచ్చ అంతా ఇంతా కాదు..వాళ్ళ దెబ్బకు థియేటర్ల గోడలు  ఈళల శబ్దాలతో దద్దరిల్లిపోతాయి.ఇక మన హ్యాండ్సమ్ హీరోకి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే అని చెప్పాలి. ఆయన గ్లామర్ కి అమ్మాయిలు అయితే ఫిదా అవుతూ.. తమకు ఫ్యూచర్ లో మహేష్ బాబు లాంటి భర్త రావాలి అని అనుకుంటూ వుంటారు. ఇక మహేష్ సినిమాని మొదటి రోజు మొదటి షో చూసే లేడీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు మన తెలుగు రాష్ట్రాల్లో. దీన్ని బట్టి మన సూపర్ స్టార్ క్రేజ్ ఈ రేంజ్ లో అర్ధమవుతుంది.

 ఇక మహేష్ హవా కేవలం సినిమాల్లోనే కాదు, సోషల్ మీడియాలోనూ దుమ్ములేపుతాడు. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్‌స్టాలలో తెగ యాక్టివ్‌గా ఉంటూ సినిమాలకు సంబంధించిన అన్ని రకాల అప్డేట్‌లను అభిమానుల చెంతకు చేరుస్తాడు. అందుకేనేమో సోషల్ మీడియాలో అతడు ఫాలోవర్స్‌తోనే రికార్డు సృష్టించాడు. మహేష్ బర్త్ డే, సినిమాల విడుదల సమయంలో సోషల్ మీడియాలో రికార్డు స్తాయిలో రెస్పాన్స్ వస్తోంది. మహేష్‌కు ట్విట్టర్‌లో 10.9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అంటే కోటి తొమ్మిది లక్షలన్నమాట.దీంతో దక్షిణాది హీరోల్లోనే అత్యధిక ఫోలోవర్స ఉన్న హీరోగా రికార్డు సాధించాడు. అయితే ఇటీవల మహేష్ ఇన్‌స్టాలోనూ రికార్డు చేశాడు. ఇన్‌స్టాలోనూ 6 మిలియన్ల ఫాలోవర్సు నమోదయ్యారు.

ఈ న్యూస్‌ను అతడి అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మహేష్ పరుశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమాలో నటిస్తున్నాడు.మహేష్ సరసన కీర్తీ సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మళ్ళీ లాంఛనంగా ప్రారంభమైంది. జనవరిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.సినిమా ఎక్కువ భాగం అమెరికాలో ఉండబోతోందని తెలుస్తోంది.మహేష్ ఈ సినిమాలో ఓ బ్యాంక్ ఎంప్లాయిగా కనిపించనున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి...!!


మరింత సమాచారం తెలుసుకోండి: