ప్రస్తుతం బుల్లితెరపై బొమ్మ అదిరింది షో ఎంతగానో క్రేజ్ సంపాదించి ప్రస్తుతం టాప్ రేటింగ్ తో  దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ప్రతి వారం కూడా కమెడియన్స్ సరికొత్త స్కిట్స్  తో బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నారు. అదే సమయంలో అటు  జడ్జీలు కూడా స్కిట్ లో భాగంగా పలు రకాల పంచ్ లు  వేస్తూ  ఉండడంతో బుల్లితెర ప్రేక్షకులు  కడుపుబ్బ నవ్వుకున్నారు. జీ తెలుగు లో ప్రసారమయ్యే బొమ్మ అదిరింది షో ప్రస్తుతం టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది. అయితే షో ని  మరింత పాపులర్ చేసేందుకు షో నిర్వాహకులు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే.



 ఈ క్రమంలోనే షో యాంకర్లను  మార్చేసి ప్రస్తుతం శ్రీముఖి యాంకర్ గా తీసుకువచ్చారు. అంతేకాకుండా ప్రస్తుతం జడ్జి లు  గా ఉన్న నాగబాబు జానీ మాస్టర్ తో పాటు ప్రతి వారం ఒక సరికొత్త గెస్ట్ ని  రప్పిస్తున్నారు. గతవారం పోసాని కృష్ణమురళి అదిరింది షోలో జడ్జిగా వచ్చి బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన విషయం తెలిసిందే. ఇక ఈ వారం బొమ్మ అదిరింది షో లో ఎవరు జడ్జిగా రాబోతున్నారు అని ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఈ షో కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు షో నిర్వాహకులు. ఇక ప్రస్తుతం ఈ ప్రోమో  సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.



 అయితే ఈ వారం గెస్ట్ గా ఒకప్పుడు హీరోయిన్ గా తన అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న లైలా ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ లైలా ఎంట్రీతో బొమ్మ అదిరింది షో కి సరికొత్త ఎట్రాక్షన్ వచ్చింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఓ లైలా లైలా లైలా... నచ్చావే  మరదలు పిల్ల అనే పాట తో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ లైలా శ్రీముఖి తో కలిసి కొన్ని స్టెప్పులు వేసింది. ఇంతలో ఎంట్రీ ఇచ్చిన పండు.. నీ నవ్వే నన్ను పడేసింది అంటూ లైలా తో డైలాగ్స్ చెప్పడం మొదలు పెట్టాడు. ఇక అంతలో  నువ్వు ఎంత ట్రై చేసినా నీకు పడే వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ అంటూ సౌండ్ రావడం తో అందరూ కడుపుబ్బ నవ్వుకున్నారు. ఈ క్రమంలోనే అదిరింది షోలో స్కిట్ లను  ఎంతగానో ఎంజాయ్ చేస్తూ పొట్టచెక్కలయ్యేలా నవ్వింది హీరోయిన్ లైలా.

మరింత సమాచారం తెలుసుకోండి: