టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గడచిన మూడేళ్లలో వరుసగా మూడు విజయాలతో కెరీర్ పరంగా హ్యాట్రిక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అంతకు ముందు బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాల ద్వారా పరాజయాలను మూటగట్టుకున్న మహేష్ ఆ తర్వాత వచ్చిన భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాల విజయాలతో హ్యాట్రిక్ దక్కించుకున్నారు. ఇక అతి త్వరలో ఆయన నటించనున్న లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట తొలి షెడ్యూలు అమెరికాలో షూటింగ్ జరుపుకోనుంది. తొలిసారిగా సూపర్ స్టార్ కి జోడిగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి యువ దర్శకుడు పరుశురాం దర్శకత్వం వహిస్తుండగా జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు కలిసి ఈ సినిమాను ఎంతో భారీ ఖర్చుతో నిర్మించనున్నాయి.

ఇకపోతే నటన పరంగా చిన్నతనంలోనే తండ్రి సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా సినిమా రంగానికి అడుగుపెట్టిన మహేష్, బాలనటుడిగా పలు సినిమాల్లో నటించి అప్పట్లోనే ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. ఇక ఆ తర్వాత రాజకుమారుడు సినిమాతో హీరోగా మారిన మహేష్ బాబు తొలి సినిమాతో భారీ సక్సెస్ ను అందుకున్నారు. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా లోని సాంగ్స్ కూడా అతిపెద్ద విజయాన్ని అందుకున్నాయి. ముఖ్యంగా సాంగ్స్ తో పాటు సినిమాలోని కీలక సన్నివేశాలకు మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా మరింతగా అదరగొట్టింది అని చెప్పాలి.

ఇకపోతే ఈ సినిమా వచ్చి 21 సంవత్సరాలు గడపడంతో ఇటీవల తమ బ్యానర్ నుంచి వచ్చిన పలు సినిమాలు యొక్క సాంగ్స్ ని డిజిటలైజ్ చేస్తూ వైజయంతి మూవీస్ సంస్థ తమ అధికారిక సోషల్ మీడియా మాధ్యమం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ వస్తోంది. అందులో భాగంగా మూడు రోజుల క్రితం మహేష్ బాబు నటించిన రాజకుమారుడు సినిమాలోని సాంగ్స్ ని పూర్తి డిజిటల్ గా మార్చి రిలీజ్ చేశారు. ఇక ప్రస్తుతం ఆ సాంగ్స్ మంచి వ్యూస్ అందుకని యూట్యూబ్ లో కొనసాగుతున్నాయి. ఇక ఈ సాంగ్స్ ని లేటెస్ట్ డిజిటల్ వర్షన్ లో చూసిన మహేష్ ఫ్యాన్స్ ఎంతో సంబరపడుతూ వాటిని పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో మరింతగా వైరల్ చేస్తున్నారు.....!!









 

మరింత సమాచారం తెలుసుకోండి: