పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చివరిగా అజ్ఞాతవాసి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రెండున్నరేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించినంత సక్సెస్ ని అయితే అందుకోలేకపోయింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇక ఈ సినిమా అనంతరం రాజకీయాల్లో బిజీ అయిన పవన్ ఇటీవల వకీల్ సాబ్ సినిమా ద్వారా మళ్లీ సినిమా రంగానికి రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తొలిసారిగా బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ తో కలిసి టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ లాయర్ పాత్ర పోషిస్తుండగా ఆయనకు జోడీగా శృతిహాసన్ నటిస్తోంది. అంజలి, నివేదాథామస్, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ ని అందిస్తుండగా పి.ఎస్.వినోద్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి అతి త్వరలో లేటెస్ట్ గా అప్ డేట్స్ వరుసగా రాబోతున్నట్లు సమాచారం. వాస్తవానికి ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడినట్లు తెలుస్తోంది. డిసెంబర్ మొదటి వారంలో ఈ సినిమా టీజర్ రానుందని ఇక అక్కడి నుండి పవర్ స్టార్ మేనియా మొదలైనట్లే అని లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్.

మరోవైపు ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకోవడంతో సినిమా యొక్క పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా వేగవంతంగా జరుగుతున్నాయట. అజ్ఞాతవాసి తో డిజాస్టర్ ను అందుకున్న పవర్ స్టార్ ఎట్టి పరిస్థితుల్లో ఈ వకీల్ సాబ్ సినిమా ద్వారా భారీ హిట్ సొంతం చేసుకొని తన ఫ్యాన్స్ ని ఖుషి చేయాలని చూస్తున్నారు. కాగా ఈ సినిమాకి యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా గతంలో బాలీవుడ్ తో తెరకెక్కిన కోర్టు డ్రామా మూవీ పింక్ కి అధికారిక తెలుగు రీమేక్ గా వకీల్ సాబ్ తెరకెక్కుతోంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: