టాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమలో కమెడియన్స్ గా తమకంటూ గొప్ప పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్న వారిలో కోట శ్రీనివాస రావు, బాబు మోహన్ కూడా ఉంటారు అని చెప్పక తప్పదు. కెరీర్ తొలినాళ్లలో అక్కడక్కడా చిన్న పాత్రలు పోషించిన ఈ ఇద్దరు నటులు ఆ తర్వాత తమ టాలెంట్ తో పలు సినిమాల్లో కమెడియన్ లుగా అవకాశాలు అందుకుని ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే తమ పెర్ఫార్మెన్స్ తో గొప్ప పేరు ప్రఖ్యాతులు గడించారు. ఒకానొక సమయంలో కోట, బాబు మోహన్ జోడి లేనిదే చాలావరకు సినిమాలు తెరకెక్కేవి కావు అంటే అతిశయోక్తి కాదేమో. ఇక వీరిద్దరూ ఒకసారి తెరపై కనిపించారు అంటే ఆడియన్స్ కి గిలిగింతలు తప్పవనే చెప్పాలి.

ఆ విధంగా వీరిద్దరూ పలు సినిమాల్లో మంచి పేరుతో కొనసాగారు. అయితే ఇటీవల కాలంలో మాత్రం కొన్ని కారణాల వల్ల ఇద్దరు సినిమాలు చేయడం తగ్గించారు. మరోవైపు కొన్నేళ్ల క్రితం రాజకీయాల్లో చేరిన బాబు మోహన్ ఆపై సినిమాలను చాలావరకు ఆపేశారు. ఇకపోతే ఈ ద్వయం ప్రస్తుతం ఈ టీవీ ఛానల్లో ప్రసారం అవుతున్న ఆలీతో సరదాగా ప్రోగ్రాం లో సందడి చేశారు. వచ్చే సోమవారం ప్రసారం కానున్న ఈ ప్రోగ్రాం కు సంబంధించి లేటెస్ట్ గా ప్రోమో రిలీజ్ చేసింది ఈ టీవీ యాజమాన్యం. ఇక ఆ ప్రోమో లో ఇద్దరూ తమ జీవితానుభవాలను పంచుకోవడంతో పాటు తమ జీవితంలో జరిగిన ఒక విషాద ఘటన గురించి కూడా ప్రస్తావించి కొంత ఉద్వేగానికి గురయ్యారు.

మొదటినుంచి మేమిద్దరం అన్ని విషయాల్లోనూ ఒకే విధంగా వ్యవహరించేవాళ్ళం అదేవిధంగా ఇద్దరికీ ఒక విషయంలో సారూప్యత కూడా ఉంది. నా కుమారుడు అలానే బాబు మోహన్ కుమారుడు ఇద్దరూ కూడా ఇటీవల బైక్ యాక్సిడెంట్ లో చనిపోవడం మా ఇద్దరినీ ఎంతో కలిచివేసిన ఘటనలు. అయితే అదృష్టవశాత్తు అతనికి మరో కుమారుడు ఉన్నాడు కానీ నాకు మాత్రం ఎవరూ లేరు అంటూ కోట ఉద్వేగంతో చెప్పిన మాటలు ఆలీతో సహా ప్రేక్షకులందరినీ కన్నీళ్లు పెట్టించాయి. వయసు రీత్యా ఒకప్పటి వలే ప్రస్తుతం సినిమాలు చేయలేకపోతున్నానని ఓల్డ్ ఈజ్ గోల్డ్  అనేకంటే గోల్డ్ ఎప్పటికీ ఓల్డ్ అవ్వదని కాల్చిన కొద్దీ మరింతగా మెరుగు పడుతుందని కోటా చెప్పిన మాటలు షోలో హర్షధ్వానాలు పూయించాయి. మొత్తంగా ఈ ప్రోమోని బట్టి చూస్తే ఆలీతో సరదాగా తదుపరి ఎపిసోడ్ మంచి ఇంట్రెస్టింగ్ గా సాగనున్నట్లు తెలుస్తుంది.....!!




మరింత సమాచారం తెలుసుకోండి: