ప్రస్తుతం అభి జర్నీకి సంబంధించి ఈమె ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో హారిక తల్లి కూడా ఉన్నారు. ఈ ఇద్దర్నీ యాంకర్ రవి ఇంటర్వ్యూ చేశాడు. అందులో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది అభిజీత్ తల్లి. ముఖ్యంగా అతడి పర్సనల్ లైఫ్ గురించి చెప్పుకొచ్చింది. ఇక గేమ్ గురించి మాట్లాడుతూ.. సోహెల్, అరియానా సీక్రెట్ రూమ్ నుంచి ఇంట్లోకి వచ్చినపుడు అభి అరిచాడని.. అప్పుడు అతడిని చూస్తే భయమేసిందని ఈమె అన్నారు.
ఇక ఎక్కడ రెండు రోజులకే బయట అభిపై నెగెటివిటీ వస్తుందేమో అని టెన్షన్ పడ్డామని వెల్లడించింది అభి తల్లి. కానీ తర్వాత అసలు విషయం తెలిసింది. చాలా సేపు ఓపిక పట్టిన తర్వాతే అలా అరిచాడని తెలిసిన తర్వాత ఊరటనిచ్చిందని అభి తల్లి లక్ష్మీ తెలిపింది. మరోవైపు బిగ్ బాస్ షోలో విలన్స్ అమ్మ రాజశేఖర్, అఖిల్ అనిపిస్తుందని.. ఎందుకంటే ఎదుటి వాళ్లను మనం ఒక మాట అంటే.. వాళ్లు అంటున్నపుడు తిరిగి తీసుకోవాలని చెప్పింది. కానీ ఆ ఓపిక వాళ్లలో లేదని చెప్పింది లక్ష్మీ.
అయితే అభిజిత్ మొదటి నుంచి అమ్మ రాజశేఖర్కు అదే చెప్పుకుంటూ వచ్చాడని.. తన విషయంలో విలన్ అంటే అమ్మ రాజశేఖర్ అని చెప్పింది. మరోవైపు మూడో వారం అప్పుడు జరిగిన రోబో టాస్కులో కూడా అభిజీత్ ఐడియా అద్భుతం అని.. కానీ అప్పుడు అందరూ అతన్ని తప్పు పట్టినా కూడా గంగవ్వ సపోర్ట్ చేసిందని గుర్తు చేసుకుంది. ఏదేమైనా కూడా అభిజీత్ విన్నర్ అయితే బాగుంటుందని ఆమె ఆశించారు.