అజ్ఞాతవాసి సినిమా తర్వాత సినిమాల నుండి తప్పుకొని తన పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రెండేళ్ల రాజకీయ ప్రయాణం చేసిన తర్వాత మరలా తిరిగి "వకీల్ సాబ్" సినిమాతో వెండితెరపై రీ- ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇది బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన 'పింక్‌' సినిమాకు రీమేక్‌గా ఈ వకీల్ సాబ్ రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఇందులో పవన్ తో పాటుగా మరో ముగ్గురు హీరోయిన్స్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే, అయితే రీసెంట్ గా.. సినిమాను మలుపు తిప్పే పాత్ర కోసం నాలుగో హీరోయిన్‌గా శృతి హాసన్‌ని కన్ఫామ్ చేశారనే వార్తలు ఇటీవలి కాలం నుండి వినిపిస్తున్నాయి. అయితే తాజాగా వాటిని నిజం చేస్తూ తాను వకీల్ సాబ్ సెట్స్ పైకి రాబోతున్నానని హీరోయిన్ శ్రుతిహాసన్ తెలిపింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ వకీల్ సాబ్ చిత్రానికి బోనీకపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, అంజలి, నివేత థామస్, అనన్య నాగేళ్ల, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పుడు ఇందులో నాలుగో హీరోయిన్‌కి కూడా స్కోప్ ఉండటంతో శృతి హాసన్‌ని ఫైనల్ చేశారు. ఈ నేపథ్యంలో శృతిహాసన్.. 'అవును.. నేను వకీల్‌సాబ్ మూవీలో నటిస్తున్నాను. ఆ సినిమాలో నా పాత్ర ఏంటనేది ఇప్పుడే చెప్పలేను' అంటూ ఓపెన్ అయింది. మరోసారి వకీల్ సాబ్ అప్‌డేట్ ఇస్తూ పవన్ కళ్యాణ్ రీ- ఎంట్రీ గురించి ఆసక్తికరంగా మాట్లాడింది.

పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి రావడం చాలా సంతోషంగా అనిపిస్తోందని, ఆ సినిమాలో తానూ కూడా భాగమవుతుండటం అంతకు రెట్టింపు సంతోషాన్నిస్తోందని చెప్పింది. జనవరి నుంచి `వకీల్ సాబ్` షూటింగ్‌కి హాజరు కాబోతున్నానని తెలిపింది. పవన్‌తో మూడోసారి పనిచేస్తున్నా... వెరీ హ్యాపీ అని పేర్కొంటూ మెగా అభిమానుల్లో జోష్ నింపింది. అయితే శృతి ఇచ్చిన ఈ అప్‌డేట్‌తో వకీల్ సాబ్ సినిమా సంక్రాంతి బరిలో ఉండదనే విషయం కన్ఫామ్ అయిందనే చెప్పుకోవాలి. వకీల్ సాబ్ మూవీలో పవన్ కళ్యాణ్ న్యాయవాది పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తుండగా.. చిత్రంలోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో పవన్‌ కళ్యాణ్ కి భార్యగా శృతి హాసన్ కనిపించనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: